పీకే పూర్తి చేయాలంటే ఏపీ స్టేట్ ఇలా ఉండాలి!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌మిట్ అయిన చిత్రాల‌న్నీ ఇప్పుడు పూర్తి చేయాలి. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న చిత్రాలు అక్క‌డే అలా మూలుగుతున్నాయి

Update: 2024-10-14 08:30 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌మిట్ అయిన చిత్రాల‌న్నీ ఇప్పుడు పూర్తి చేయాలి. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న చిత్రాలు అక్క‌డే అలా మూలుగుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు సిద్దంగా ఉన్నాయి. అవే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ. రెండు షూటింగ్ మ‌ధ్య‌లోనే ఉన్నాయి. ఇప్ప‌టికే తాడేప‌ల్లి స‌మీపంలో వేసిన వీర‌మ‌ల్లు సెట్స్ లో ప‌వ‌న్ పై ఓ చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.

కానీ ఇంత‌లో ఏపీలో తిరుప‌తి క‌ల్తీల‌డ్డు వ్య‌వ‌హారం తెర‌పైకి రావ‌డంతో స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌డుం బిగించ‌డంతో? ఎలాంటి స‌న్నివేశం ఏర్ప‌డిందే తెలిసిందే. ఆ కార‌ణంగా కొంత షూటింగ్ డిలే అయింది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ షూటింగ్ కి వెళ్ల‌లేదు. తాజాగా `వీర మల్లు` తదుపరి షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుంది. దీంతో ప‌వ‌న్ కూడా సీరియ‌స్ గానే బ‌రిలోకి దిగుతున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లో న‌వంబ‌ర్ 10 క‌ల్లా షూటింగ్ పూర్తి చేసేద్దామ‌ని యూనిట్ కి ప్రామిస్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆదిశ‌గా మేక‌ర్స్ అడుగులు వేస్తూ ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారు. అలాగే ఓజీ కూడా మ‌ధ్య‌లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారుట‌. త‌న ఐడియాని కూడా మేక‌ర్స్ కి తెలియ‌జేసారుట‌.

దీంతో వాళ్లు కూడా సిద్ద‌మ వుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ప‌వ‌న్ చెప్పిన‌ట్లు జ‌ర‌గాలంటే? ఈ మూడు నాలుగు నెల‌లు పాటు ఏపీ రాష్ట్రం ప్ర‌శాంతంగా ఉండాలి. ఎలాంటి అల‌జ‌డ‌లు తలెత్త‌కుండా. .. విమ‌ర్శ‌లు..వివాదాలు లేకుండా కూల్ రూలింగ్ సాగాలి. ప్ర‌తిప‌క్ష హోదాలేని పార్టీ ప్ర‌భుత్వంపై ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా? ప‌వ‌న్ సైలెంట్ గా సినిమాలకే ప‌రిమిత‌మ‌వ్వాలి. అప్పుడే ప‌వ‌న్ డెడ్ లైన్ ప్ర‌కారం షూటింగ్ లు పూర్తయ్యే అవ‌కాశం ఉంది. మ‌ధ్య‌లో డీవియేట్ అయితే గ‌నుక క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది.

Tags:    

Similar News