బిగ్ బాస్ 8 : డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు జరిగిన 3 వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.

Update: 2024-09-27 05:38 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు జరిగిన 3 వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, 3వ వారం అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం అందులో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతారు. నామినేషన్స్ లో సోనియా, పృధ్వి, నబీల్, మణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ ఉన్నారు. వీరిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కు తక్కువ ఓట్స్ పోల్ అయినట్టు తెలుస్తుంది.

హౌస్ లో ఎలాంటి టాస్క్ అయినా ఆడుతున్న పృధ్వికి తక్కువ ఓటింగ్ ఉందని టాక్. ఓటింగ్స్ అనాలిసిస్ లో చూస్తే అతనే లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. అతని తర్వాత మణికంఠ సెకండ్ లీస్ట్ గా ఉన్నాడు. ఈ వారం పృధ్వి హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృధ్వి ఇలా డేంజర్ జోన్ లో ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది.

పృధ్వి తో పాటు మణికంఠ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మణికంఠ టాస్కుల విషయంలో కన్ ఫ్యూజ్ అవుతూ మిగతా హౌస్ మేట్స్ తో కూడా చాలా కన్ ఫ్యూజన్ తో మాట్లాడుతున్నాడు. అతని ఆట మీద అతనికే ఒక క్లారిటీ లేదన్నట్టుగా అనిపిస్తుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఐతే ఈ వారం సోనియా కూడా నామినేషన్స్ లో ఉండగా ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

నిఖిల్, పృధ్విల పక్కన ఉంటూ సోనియా హౌస్ మొత్తానికి వ్యతిరేకంగా మారింది. గుడ్ల టాస్క్ లో ఆమె చేసిన అతి వల్ల మిగతా హౌస్ మేట్స్ అంతా ఆమెను ఎటాక్ చేశారు. ముఖ్యంగా యష్మి అయితే నామినేషన్స్ లో సోనియాను టార్గెట్ చేసి వాదనలు వినిపించింది. ఐతే ఈ వారం సోనియా, యష్మి ఇద్దరు కూడా నిఖిల్ టాస్క్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో 9 మని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను రాకుండా ఉందేందుకు టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో మూడిటిలో హౌస్ మెట్స్ ఓడిపోయారు. అందుకే 9 మంది దాకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది.

Tags:    

Similar News