డ్రస్‌ జారిపోతుందేమో అని భయపడ్డా..!

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న భారతీయ ముద్దుగుమ్మల్లో ప్రియాంక చోప్రా ఒకరు అనే విషయం తెల్సిందే.

Update: 2024-09-18 12:30 GMT

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న భారతీయ ముద్దుగుమ్మల్లో ప్రియాంక చోప్రా ఒకరు అనే విషయం తెల్సిందే. 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత బాలీవుడ్‌ లో అడుగు పెట్టి స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. దేశం మొత్తం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు ఇటీవల చేసిన సిటాడెల్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆమె స్థాయి, క్రేజ్ మరింత పెరిగింది అనడంలో సందేహం లేదు.


అమెరికాకు చెందిన పాప్ సింగ్‌ నిక్ జోన్స్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. తనకంటే పదేళ్లు చిన్నవాడు అయినా నిక్‌ జోనస్ తో చాలా సంతోషంగా వైవాహిక జీవితాన్ని సాగిస్తున్న ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వరల్డ్‌ కప్‌ సాధించిన రోజులను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో చాలా భయపడ్డాను అని, ఆ రోజు ఏం జరిగిందో తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని, మరో వైపు సిగ్గుగా అనిపిస్తుందని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపిక అయి 24 సంవత్సరాలు అయిన సందర్భంగా అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... నా జీవితం మొత్తం 2000 సంవత్సరంను మర్చి పోలేను. మిస్ వరల్డ్‌ కాంపిటీషన్ జరిగే వేదికను అప్పట్లో మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నాకు 18 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఆ వేదికపైకి వెళ్లాను. అక్కడకు వెళ్లేందుకు నేను చాలా కష్టపడ్డాను. ఆ ఏడాది నవంబర్‌ 30వ తేదీని నేను జీవితం మొత్తం మరిచి పోలేను. అలవాటు లేని డ్రెస్‌, హీల్స్ ను ఆ రోజు నేను ధరించాల్సి వచ్చింది. ఆ డ్రెస్ నాకు అస్సలు కంఫర్ట్‌ గా అనిపించలేదు. ఆ డ్రెస్ లో నడవడం నాకు కష్టం అనిపించింది. అలాంటిది అంత మంది ముందు ఆ డ్రెస్ లో నిలవడం కష్టంగా అనిపించింది.

అంత మంది ముందు నేను నిల్చున్న సమయంలో నా శరీరంలోని ప్రతి ఒక్క నరం వణుకుతున్నట్లుగా అనిపించింది. ముఖ్యంగా నేను వేసుకున్న డెస్ ఎక్కడ జారి పోతుందో అనే భయం ఎక్కువగా ఉంది. ఆ భయంతోనే నా ముందు ఉన్న గెస్ట్‌ లకు నమస్కారం చేశాను. ఆ సమయంలో నా మొహం లో టెన్షన్ ను చూడవచ్చు. గూగుల్‌ లో అప్పటి ఫోటోలను చూసినప్పుడు ఇప్పటికీ నాకు ఒకింత నవ్వు వస్తుంది, ఒకింత టెన్షన్‌ కలుగుతుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగే వేదిక కి ప్రియాంక చోప్రా 24 ఏళ్ల తర్వాత కూతురుతో కలిసి వెళ్లింది. అక్కడకు కూతురు తో, ఇన్నేళ్ల తర్వాత వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ప్రియాంక చోప్రా పేర్కొంది.

Tags:    

Similar News