లేటు ఫిరాయించిన ఆర్జీవీ.. బాబు-ప‌వ‌న్‌ల‌కు విషెస్!

నిజానికి ఎన్నిక‌ల ముందు రామ్ గోపాల్ వ‌ర్మ ఆ ముగ్గురు నాయ‌కుల గురించి చేసిన కామెంట్ల‌ను ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేదు.

Update: 2024-06-04 15:12 GMT

ఆర్జీవీ ప్లేటు ఫిరాయించాడు. 2024 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం-జ‌న‌సేన‌- బిజేపి కూట‌మి గ్రేట్ విక్ట‌రీని ప్ర‌త్య‌క్షంగా చూసిన రామూజీ నేరుగా చంద్ర‌బాబు నాయుడు- లోకేష్ నాయుడు- ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. నిజానికి ఎన్నిక‌ల ముందు రామ్ గోపాల్ వ‌ర్మ ఆ ముగ్గురు నాయ‌కుల గురించి చేసిన కామెంట్ల‌ను ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేదు.

వైరి వ‌ర్గాల‌తో చాలా కాలం పాటు ర‌క‌ర‌కాల వివాదాల్లో త‌ల దూర్చిన ఆర్జీవీ ఎట్ట‌కేల‌కు ప్ర‌త్య‌ర్థుల విక్ట‌రీని జీర్ణించుకునే ప‌నిలో ప‌డ్డాడు. వ‌ర్మ మునుప‌టిలా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. చాలా సింపుల్ గా కంగ్రాట్స్ చంద్ర‌బాబు, లోకేష్, ప‌వ‌న్ అంటూ విషెస్ తెలియ‌జేసాడు.

నిజానికి రామ్ గోపాల్ వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. 2019లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేసి చంద్రబాబు నాయుడుకు షాకిచ్చాడు. ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా అలాంటి ప్ర‌య‌త్న‌మే. CBN కి వ్యతిరేకంగా ప్ర‌తిసారీ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నాడు. ఏ అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్‌ను ఎగతాళి చేస్తాడు. అన్నివేళ‌లా ప‌వ‌న్ అభిమానులతో ఆన్‌లైన్ వార్‌లో పాల్గొంటాడు. కానీ ఇప్పుడు చంద్ర‌బాబు- ప‌వ‌న్ అండ్ కో అసాధార‌ణ మెజారిటీతో ఎన్నిక‌ల్లో గెలిచారు. నేటి ఉదయం నుంచి టీడీపీ, జనసేన పార్టీల ప్రజలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంత‌లోనే ఆర్జీవీ కూడా విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పాడు. అయితే అత‌డు ప్లేటు ఫిరాయించ‌డంపై ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News