పుష్ప 2: జాతర ఎపిసోడ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప" సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-24 11:05 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప" సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు బన్నీ. దీంతో... పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో డిసెంబర్ 5న పుష్ప 2 వస్తున్నాడంటూ నిర్మాతలు బ్లాక్ బాస్టింగ్ న్యూస్ చెప్పారు.

దీంతో.. ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ, సంబరాలకు ప్రిపేర్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన నిర్మాతలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో పుష్ప 3 టాపిక్ ఒకటి కాగా... ప్రధానంగా జాతర ఎపిసోడ్ టాపిక్ మరొకెత్తు. ఇదే సమయంలో... బన్నీకి రాజకీయ పార్టీలు, మెగా ఫ్యాన్స్ పైనా నిర్మాతలు స్పందించారు.

అవును... పుష్ప 2 ప్రమోషన్స్ నేటితో ప్రారంభమయ్యాయి అనుకోవచ్చు. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిత్ర నిర్మాతలు. ఇందులో భాగంగా... ఈ సినిమా కోసం అల్లూ అర్జున్ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఈ సినిమాను అందరూ చూసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరారు.

ఇదే క్రమంలో... ఈ సినిమాలో ప్రధానంగా జాతర ఎపిసోడ్ అనేది మొత్తం సినిమాకే హైలెట్ అని చెప్పిన నిర్మాతలు.. ఈ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని చెప్పారు. ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్ కి 35 రోజుల సమయం పట్టిందని.. సుమారు 20 రోజులు రిహార్సల్స్ చేసి షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు.

ఇదే సమయంలో.. బాడీ మొత్తం పెయింటింగ్ చేసుకుని రోజంతా ఆ గెటప్ లోనే ఉండేవారని.. చెమట వచ్చి పెయింట్ పాడైపోకుండా చిన్న ఫ్యాన్ పెట్టుకునేవారని.. సుకుమార్ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తీర్చి దిద్దారని నిర్మాతలు కొనియాడారు. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ తో పాటు గూస్ బంప్స్ వచ్చే సీన్లు చాలానే ఉన్నాయని నిర్మాత రవిశంకర్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే పార్ట్ 3 విషయాన్ని ప్రస్థావించారు. ఇందులో భాగంగా.. పుష్ప 2ని హిట్ చేస్తే కచ్చితంగా పుష్ప 3ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఇదే సమయంలో... అల్లూ అర్జున్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే అని.. ఈ సినిమాను ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ చూడాలని కోరారు!

Tags:    

Similar News