మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు గుండుబాస్!

టాలీవుడ్ త‌ర‌హాలోనే కోలీవుడ్ లోనూ రీ-రిలీజ్ ల ట్రెండ్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-12 21:30 GMT

టాలీవుడ్ త‌ర‌హాలోనే కోలీవుడ్ లోనూ రీ-రిలీజ్ ల ట్రెండ్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల ఓల్డ్ హిట్ చిత్రాల్ని రీ-రిలీజ్ చేసి కోట్ల ఆదాయం చూస్తున్నారు. అభిమానుల కోసం ప్ర‌త్యేకంగా 4కె పార్మెట్ లో చిత్రాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కొన్ని సినిమాలు రీ-రిలీజ్ లోనే మంచి వ‌సూళ్లు సాధించాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా `శివాజీ` ది బాస్` మ‌రోసారి రీ-రిలీజ్ కి ముస్తాబుతుంది.

సెప్టెంబ‌ర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం పరిమిత థియేట‌ర్లోనే విడుద‌ల వుతుంది. టికెట్ ధ‌ర కూడా చ‌వ‌క‌గానే ఉంది. 99 రూపాయ‌ల‌కే టికెట్ అందిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతుందంటూ నాలుగు వారాలుగా ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌త్యంలో సెప్టెంబ‌ర్ 20న ప‌క్కాగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారుట‌.

అయితే ఇది ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం మూడ‌వ‌సారి. 2007లో తొలిసారి ఈ చిత్రం రిలీజ్ అయింది. అప్ప‌ట్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. తెలుగులో కాస్త వీక్ గా అనిపించినా ఇండియాలో చాలా చోట్ల పెద్ద స‌క్సెస్ అయింది. విదేశాల్లో అయితే బంప‌ర్ హిట్ అయింది. భారీ వ‌సూళ్ల‌తో రికార్డులే న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 2017 రీ-రిలీజ్ చేసారు.

అప్ప‌టి థియేట్రిక‌ల్ టెక్నాల‌జీ అప్ డేష‌న్ బేస్ చేసుకుని రిలీజ్ చేసారు. ఇప్పుడు మాత్రం 4కె ఫార్మెట్ లో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని అంచ‌నాలున్నాయి. అస‌లే సూప‌ర్ స్టార్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News