SSMB29 : దసరా పండుగ సందర్భంగా..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌ లో రూపొందబోతున్న సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

Update: 2024-09-16 06:30 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌ లో రూపొందబోతున్న సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. షూటింగ్ ప్రారంభం ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దసరా సందర్భంగా సినిమాను ప్రారంభించబోతున్నారట. దసరా కానుకగా సినిమాను ప్రకటించాలని మొదట భావించారట. అయితే అదే సమయంలో సినిమా ను లాంచనంగా ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కానందున ముందుగా అనుకున్న ప్రకారం రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం లేదు.

ఈ ఏడాది చివర్లోనే రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది లో ముగించి 2026 లో విడుదల చేయాలని భావించారు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఇంకా బ్యాలన్స్ ఉన్న కారణంగా రాజమౌళి ఈ ఏడాదిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను ఈ ఏడాది ప్రారంభించడం అసాధ్యమని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడట. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా గడ్డం, జుట్టు పెంచుతూ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది వరకు మహేష్‌ బాబు ఇదే లుక్ లో కనిపించబోతున్నాడా అనేది చూడాలి.

రాజమౌళి ఈగ నుంచి వరుసగా సెంథిల్‌ తో వర్క్ చేశాడు. కానీ మహేష్ బాబుతో సినిమా కోసం సెంథిల్‌ తో కాకుండా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీఎస్ వినోద్‌ తో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే పీఎస్ వినోద్‌ యొక్క బల్క్ డేట్లను రాజమౌళి తీసుకున్నాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ లో కూడా పీఎస్ వినోద్‌ పాల్గొంటున్నాడని సమాచారం అందుతోంది. 2025 ఆరంభంలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కి వెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడు. జక్కన్న ఏ సినిమా కూడా హడావిడి గా చేసిన దాఖలాలు లేవు. అలాగే ఈ సినిమా కూడా నెమ్మదిగానే మొదలై, మేకింగ్ కూడా అలాగే సాగబోతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్న ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డ్ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నాడు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన రాజమౌళి త్వరలో మొదలు పెట్టబోతున్న మహేష్ బాబు సినిమా తో కూడా అదే స్థాయిలో సక్సెస్ ను అందుకోవడం ఖాయం. ఇప్పటి వరకు మహేష్ బాబు అధికారికంగా పాన్‌ ఇండియా సినిమా చేయలేదు. రాజమౌళి తో మొదటి సారి మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. పాన్‌ వరల్డ్‌ రేంజ్ లో వీరి కాంబో మూవీ విడుదలై హిట్ కొట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

దసరా సందర్భంగా షూటింగ్ కార్యక్రమాలను లాంచనంగా ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి 2026 లేదా 27 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వరుసగా వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు రెండు సార్లు సాధించిన జక్కన్న ఈ సినిమాతో హ్యాట్రిక్ వెయ్యి కోట్లను సాధించడం ఖాయం. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేమికులు అంతా కూడా వీరి కాంబో మూవీ ప్రారంభం కోసం, విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News