నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ బంధాలు.. ఏంటి మ్యాటర్?

భారత్ కు విచ్చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్.. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు

Update: 2023-12-09 05:56 GMT

భారత్ కు విచ్చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్.. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మెగా, నందమూరి కుటుంబాలను కలిసిన ఆయన.. తాజాగా మహేశ్ బాబు గుంటూరు కారం సెట్ లో సందడి చేశారు. వరుసగా స్టార్స్ అందరినీ కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.


మొన్న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసిన టెడ్.. చిరంజీవి ఇంట్లో లంచ్ చేశారు. యంగ్ హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. వారితో సెల్ఫీలు కూడా దిగారు. ఆ తర్వాత నిన్ననందమూరి ఫ్యామిలీని కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి తారక్, కళ్యాణ్ రామ్, కొరటాల శివతో ముచ్చటించారు. ఈ రెండు కుటుంబాలను కలిసిన పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్న వేళ.. తాజా టెస్ సరండోస్ మహేశ్ బాబును కలిశారు.


గుంటూరు కారం సినిమా సెట్ లో హీరో మహేశ్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ ను టెడ్ కలిశారు. టెడ్ బృందంతో దిగిన ఫొటోలను మహేశ్ షేర్ చేశారు. నెట్ ఫ్లిక్స్ సీఈవీ టెడ్ సరండోస్ తో పాటు ఆయన టీమ్ మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలతో ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నామని.. కాఫీ తాగుతూ మాట్లాడుకున్నామని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచంలో టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సీఈవో.. టాలీవుడ్ హీరోలతో మీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సడెన్ గా భారత్ కు వచ్చిన టెడ్.. మెగా, నందమూరి ఫ్యామిలీలను, మహేశ్ బాబను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఫొటోలు దిగి లంచ్ కూడా చేయడంతో ఏం జరుగుతుందో తెలియక టాలీవుడ్ ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ లో గట్టిగా ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా నే కలవడానికి వెళ్లారా అని అడుగుతున్నారు. లేకుంటే నెట్ ఫ్లిక్స్ లో టాలీవుడ్ స్టార్స్ తో ఏదైనా సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే టెడ్.. ఇంకా ఎవరినైనా కలుస్తారా? బాలీవుడ్ స్టార్స్ ను కూడా మీట్ అవుతారా? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News