కేరళ‌లో ముగించారు..ఇక వైజాగ్, హైద‌రాబాద్ లో!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-19 10:33 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే న‌టిస్తోంది. ఇటీవ‌లే కేర‌ళ‌లో ఓ లాంగ్ షెడ్యూల్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల షెడ్యూల్ ఇది. తాజాగా కేర‌ళ షెడ్యూల్ పూర్త‌యింది.

ఈ షెడ్యూల్ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తో పాటు కీల‌క స‌న్నివేశాలు పూర్తి చేసారు. అలాగే పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగిందని స‌మాచారం. దీంతో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. న‌వంబ‌ర్ నెల‌ఖ‌రుక‌ల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌న్న‌ది యూనిట్ టార్గెట్ గా పెట్టుకుది. త‌దుపరి షెడ్యూల్ హైద‌రాబాద్, వైజాగ్ లో ఉంటుంద‌ని స‌మాచారం. న‌వంబ‌ర్ లో ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

అలాగే ఈ సినిమా స్టోరీ లైన్ కూడా లీక‌వుతుంది. ఇదొక స్పై థ్రిల్ల‌ర్ చిత్రంగా ప్ర‌చారంలో వ‌స్తోంది. ఇందులో విజ‌య్ ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కూ గౌత‌మ్ తీసిన రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. `మ‌ళ్లీ రావా`, `జెర్సీ` సినిమాల‌తో త‌న‌దైన సెన్సిబిలిటీ హైలైట్ అయింది.

రెండు సినిమాల‌కు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యారు. రెండింటిలోనూ ఎమోష‌న్ హైలైట్. అయితే విజ‌య్ సినిమా స్పై జాన‌ర్ కావ‌డంతో ఎమోష‌న్ ఎంత‌వ‌ర‌కూ క్యారీ అవుతుంద‌న్న‌ది చూడాలి. స్పై సినిమాలు ఇంత‌వ‌ర‌కూ గౌత‌మ్ కూడా ట‌చ్ చేయ‌లేదు. ఆ ర‌కంగా ఈ జాన‌ర్ లో ఇదే తొలి సినిమా. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News