మరోసారి నెట్టింట వైరల్ గా సిసోడియా... పిక్ వైరల్!

రాజకీయాల్లో ఎప్పుడు ఏ విషయం ఎలా వైరల్ గా మారుతుందో.. ఎలా నెటింట హల్ చల్ చేస్తుందో ఈ రోజుల్లో చెప్పడం కాస్త కష్టమే!

Update: 2024-09-13 12:10 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏ విషయం ఎలా వైరల్ గా మారుతుందో.. ఎలా నెటింట హల్ చల్ చేస్తుందో ఈ రోజుల్లో చెప్పడం కాస్త కష్టమే! ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి, కేబినెట్ మంత్రుల ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫొటోను వైసీపీ పోస్ట్ చేసింది.

అవును... ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు సంబంధించిన ఓ ఫోటోను వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో హోంమంత్రితో కలిసి ఏపీ కేబినెట్ మంత్రుల ముందు ఆయన కాలుపై కాలేసుకుని కుర్చున్నారు.

ఈ ఫోటోను సర్కిల్ చేసి మరీ షేర్ చేసిన వైసీపీ... "చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది!" అని ఎద్దేవా చేసింది. ఈ ఫోటోలో సిసోడియా ముందు కూర్చున్న మంత్రుల్లో నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోస్ట్ కింద కామెంట్ల యుద్ధం జరుగుతుంది.

ఇందులో భాగంగా... మంత్రులు ఐదు సంవత్సరాలే ఉంటారు, ఐఏఎస్ అధికారులు 30 ఏళ్లకు పైబడి సర్వీసులు ఉంటారు అని ఒకరు కామెంట్ పెడితే... ప్రజాస్వామ్యంలో కేబినెట్ మంత్రులు అంటే ప్రజా ప్రతినిధులు అని మరిచిపోకూడదని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఎవరి అవగాహన, ఆలోచన పరిధి మేరకు వారు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి!

                               

Tags:    

Similar News