దువ్వాడ ఇల్లు ఆమెదే... అలా సెట్ అయిందన్న మాట !

ఈ ఇల్లు తమకే చెందుతుందని దువ్వాడ సతీమణి వాణి కుమార్తె హైందవి ఆయన ఇంటికి వచ్చి గొడవ చేశారు.

Update: 2024-09-09 12:10 GMT

శ్రీకాకుళం జిల్లా టెక్కలి కి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవ టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. అది ఒక జీడిపాకం గా కూడా ఉంది. మొదట్లో దువ్వాడ ఆయన భార్య టెక్కలి జెడ్పీటీసీ వాణి, మాధురి అని ఒక మహిళ మధ్య సాగిన రచ్చ కాస్తా దువ్వాడ కొత్తగా కట్టిన ఇంటి మీదకు వెళ్ళింది. ఈ ఇల్లు తమకే చెందుతుందని దువ్వాడ సతీమణి వాణి కుమార్తె హైందవి ఆయన ఇంటికి వచ్చి గొడవ చేశారు.

అదంతా టీవీలలో వచ్చి హల్ చల్ అయింది. అంతే కాదు ఆ ఇంటి మీద సర్వ హక్కులూ తమకే ఉన్నాయని వాణి తన కుమార్తెతో కలసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు రావడం అక్కడ అంతా గొడవ సాగడం ఇది తీవ్ర స్థాయిలోనే జగడానికి దారి తీసింది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది హక్కు భుక్తాలు ఎవరికి ఉన్నాయి అన్నది మాత్రం ఎడతెగని చర్చగానే సాగింది.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరిట ఈ నెల 6న రిజిస్ట్రేషన్ చేశారు అని అంటున్నారు. దాంతో శనివారం ఆ ఇంటికి వచ్చిన దివ్వెల మాధురి ఇంటి బాల్కనీ మీద ఉండడాన్ని చూసిన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి కుమార్తెతో అక్కడికి వెళ్ళి గొడవ పడ్డారు.

ఆ ఇంట్లోకి వెళ్ళేందుకు శుక్రవారమే కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని ఆమె పోలీసులతో కూడా గొడవ పడ్డారు. అయితే ఆ ఇంటికి ఇంతలోనే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అని ఆమె ప్రశ్నించారు. అయితే ఇంతలా సాగిన గొడవ ఆ తరువాత సద్దుమణిగింది.

అసలు మ్యాటర్ ఏంటి అంటే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి కొనుగోలు చేశారు అని అంటున్నారు. ఆ విషయాన్ని స్వయంగా మాధురి మీడియాతో చెప్పారు. ఆ ఇంటిని తాను పక్కా రిజిస్ట్రేషన్ ద్వారానే కొనుగోలు చేశాను అని చెప్పుకొచ్చారు. అందువల్ల చట్టపరంగా అన్ని హక్కులూ తనకే ఉన్నాయని ఆమె అన్నారు.

ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే చూసుకోవచ్చు అని మధ్యలో తనకేమిటి సంబంధం అన్నట్లుగా ఆమె మాట్లాడారు. మొత్తం మీద చూస్తే ఒక నెల రోజులుగా ఆ కొత్త ఇంటి మీదనే కేంద్ర బిందువుగా చేసుకుని సాగిన వివాదం కాస్తా మొత్తానికి ఈ విధంగా బిగ్ ట్విస్ట్ తో ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కొనుగోలు చేసిన మాధురిదే ఆ ఇల్లు అని తేలడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది. మరి ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ తోనే ఇపుడు వాణి కానీ కుమార్తె కానీ తేల్చుకోవాలని అంటున్నారు. సో ఇదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News