'నన్నొక ఆటబొమ్మలా ఆడుకున్నారు'... జత్వానీ కీలక వ్యాఖ్యలు!

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత తీవ్ర చర్చనీయాంశం అనేది తెలిసిన విషయమే.

Update: 2024-08-30 04:37 GMT

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత తీవ్ర చర్చనీయాంశం అనేది తెలిసిన విషయమే. వైసీపీ నేతగా చెబుతున్న కుక్కల విద్యాసాగర్ తనను వేధించాడని.. అందులో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారుల పాత్ర కీలకంగా ఉందంటూ ఆమె చేసిన ఆరోపణలు ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. కలిసి మొత్తం విషయాన్ని వివరించనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జత్వానీ.. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, గత ప్రభుత్వంలో పెద్ద తలకాయలు అంటూ కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు వేధించారని.. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని.. తన దగ్గరున్న ఆధారాలు అన్నింటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని కాదంబరి జత్వానీ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడకు వెళ్లనున్న ఆమె ఏపీ ప్రభుత్వం తనకు మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.

తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్న జత్వానీ... ప్రస్తుత ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తనను చిత్రహింసలకు గురిచేసిన గత ప్రభుత్వంలోని వ్యక్తులు, పోలీసుల వివరాలను అందజేస్తానని ఆమె వెల్లడించింది. ఇప్పటికే విజయవాడ పోలీసులు తనతో మాట్లాడినట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో తనపై మల్టిపుల్ క్రిమికల్ కేసులు నమోదు చేశారని వెల్లడించిన జత్వానీ... గత ప్రభుత్వంలోని పెద్దలు, కొంతమంది పోలీసు అధికారులు తనను ఒక ఆటబొమ్మలా ఆడుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులకు కచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు అమె తెలిపింది.

మరోపక్క సోషల్ మీడియాలో కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జత్వానీ. ఇందులో భాగంగా... డబ్బుల కోసమే తాను మాట్లాడుతున్నానని, ఇదంత కావాలనే చేస్తున్నానని చెబుతూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపింది. తనలా మరెవరికీ జరగకూడదని పేర్కొన్న జత్వానీ... ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని కోరింది.

కాగా... తనను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి.. తన పొలాన్ని రయించుకుందంటూ కాదంబరి జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ఆధారంగా ఆయన ఓ డాక్యుమెంట్ ను చూపించారు. అయితే 2018లో రాసుకున్నట్లు చెబుతున్న ఆ డాక్యుమెంట్ పై 2020లో కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా ఉందని.. ఇది తప్పుడు కేసు అనడానికి ఇంతకంటే ఆధారం ఏమిటని ఆమె ప్రశ్నిస్తుంది.

https://www.facebook.com/watch/?v=436698015393453

Tags:    

Similar News