పోలీసుల అదుపులో ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి!?

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నెత కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-08-27 03:37 GMT

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నెత కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఓ సినిమా థియేటర్ స్థలానికి సంబంధించిన స్థలంపై వివాదం జరగడం.. థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

అవును... కొల్లం గంగిరెడ్డిని రైల్వే కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గంట పాటు విచారించిన తర్వాత విడిచి పెట్టారు. అయితే... గంగిరెడ్డిని విచారిస్తున్న సమయంలో ఆయన అనుచరులు అక్కడకు చేరి గొడవకు దిగారు. అనంతరం... ఎస్పీ అదేశాల మేరకు అతన్ని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

అయితే... విధుల్లో భాగంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు సోమవారం మదనపల్లెలో ఉన్నందున.. గంగిరెడ్డిని కూడా అక్కడి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.

కాగా గంగిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గా పేరొందారు. ఈ నేపథ్యంలో 2015 నవంబర్ లో అతడిని మారిషస్ లో అరెస్ట్ చేసి, ఏపీకి తీసుకొచ్చి జైల్లో ఉంచారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అతడు జైలు నుంచి విడుదలై అనేక దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!

Tags:    

Similar News