భార్య అవినీతి డబ్బు కట్టలపై భర్త హోమ్ టూర్... వీడియో వైరల్!

అయితే సాధారణంగా ఇలా ఏసీబీకి చిక్కే అధికారులను బాధితులే పట్టిస్తుంటారు! విసిగి పోయి ఫైనల్ గా ఏసీబీని ఆశ్రయిస్తుంటారని అంటారు

Update: 2024-10-09 22:30 GMT

చాలామంది ప్రభుత్వ అధికారులు లంచం ఇవ్వందే ఏ పనీ చేయరని.. చేయి తడపందే ఫైలుపై పెన్ను కదలదని.. లంచం డిమాండ్ చేయడంలో వారి శైలే వేరని.. మరికొంతమంది ఈ విషయంలో కలెక్షన్ ఏజెంట్లను కూడా మెయింటైన్ చేస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో కొంతమంది అధికారులు మాత్రం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు.

అయితే సాధారణంగా ఇలా ఏసీబీకి చిక్కే అధికారులను బాధితులే పట్టిస్తుంటారు! విసిగి పోయి ఫైనల్ గా ఏసీబీని ఆశ్రయిస్తుంటారని అంటారు. అయితే తాజాగా తన భార్య లంచం తీసుకుంటుందని.. ఎంత చెప్పినా వినడం లేదని.. లక్షల లక్షల సొమ్ము పట్టుకొచ్చి ఇంట్లో దాస్తుందని ఆరోపిస్తూ.. దానికి సాక్ష్యంగా అంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆమె భర్త.

అవును... మణికొండలో మున్సిపల్ డీఈఈ పై ఆమె భర్త అవినీతి ఆరోపణలు చేయడం, వాటికి సాక్ష్యాలు ఇవిగో అంటూ ఓ వీడియోను విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తన భార్య లంచం తీసుకోనిదే ఇంటికి రాదని స్ట్రాంగ్ గా ఆమె భర్త తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇదే సమయంలో... ప్రతీ రోజూ ఇంటికి లక్షలకు లక్షలు డబ్బు తెస్తోందని వెల్లడించారు!

ఈ మేరకు తన భార్య తీసుకుంటున్న లంచం డబ్బులు ఇవే అంటూ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపించారు. ఆ వీడియోలో ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపిస్తుండటం గమనార్హం. ఈ విషయంలో దేవుడి గది, పిల్లోలు, కబోర్డ్ లు అనే తారతమ్యాలేవీ లేకుండా.. ఎందెందు వెదికినా అందందు నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి.

ఈ క్రమంలో ఆ వీడియో తీసే సమయానికి ఇంట్లోనే సుమారు 20 నుంచి 30 లక్షల క్యాష్ ఉంటుందని అంటున్నారు. తన భార్యను లంచాలు తీసుకోవద్దనే విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రావటం లేదని.. అందుకే ఈ వీడియో బయటపెట్టినట్లు మణికొండ మున్సిపల్ డీఈఈ భర్త వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఇటీవలే పుప్పాలగూడలో సుమారు రెండు కోట్ల విలువైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిందని.. ప్రస్తుతం అందులో 30 లక్షలు పెట్టి ఇంటీరియర్ వర్క్స్ చేయిస్తుందని తెలిపారు. ఇక లంచం తీసుకున్న డబ్బును తన ఇద్దరు తమ్ముళ్లకు పంపిస్తుందని.. వారి వారి అకౌంట్లలోనే సుమారు 70 నుంచి 80 లక్షలు ఉంటాయని చెబుతున్నారు!

Tags:    

Similar News