లోకేష్ ఢిల్లీ టూర్...మ్యాటర్ సీరియస్ ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

Update: 2024-09-23 09:30 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవడమే కాదు బిజీగా గడుపుతున్నారు అని అంటున్నారు. అయితే ఈ టూర్ మాత్రం అధికారికం కాదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ టూర్ ఆంతర్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తారు అని అంటున్నారు. వరస భేటీలకు లోకేష్ షెడ్యూల్ రూపొందించుకున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ కీలకమైన భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ కూడా ప్రశ్నార్ధకమే అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఎంతో విలువ గౌరవాన్ని కేంద్రం ఇస్తోంది.

ఈ నేపధ్యంలో లోకేష్ ఢిల్లీ టూర్ లో కేంద్ర పెద్దలతో ఏమి మాట్లాడుతారు, ఏ విషయాల మీద ఆయన చర్చిస్తారు అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఏపీలో నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలతో లోకేష్ చర్చిస్తారు అని అంటున్నారు. అంతే కాదు రాజ్యసభ ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూడా కేంద్ర పెద్దల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో లడ్డూ ప్రసాదం పెద్ద ఇష్యూగా మారింది. దాంతో ఈ విషయం మీద కేంద్ర పెద్దలకు వివరించేంద్కు లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకునారా అన్న చర్చ కూడా వస్తోంది. ఒక వైపు జగన్ ప్రధానికి ఈ విషయంలో జోక్యం చేసుకోమని లేఖ రాయడంతో పాటు ఏపీలోనూ ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. దాంతో లోకేష్ ఈ విషయం మీద కూడా మాట్లాడుతారా అని కూడా అంటున్నారు.

అదే విధంగా ముంబై నటి జెత్వానీ కేసు విషయం కూడా ప్రస్తానకు రావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా పొలిటికల్ గా కూడా లోకేష్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News