జగన్ పై పూనమ్ ప్రశంసలు... ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది!!

ఆ సంగతి అలా ఉంటే ఆమె తాజాగా జగన్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు.

Update: 2024-03-06 11:20 GMT

పూనమ్ కౌర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి కూడా పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. సినిమా హీరోయిన్ గా ఆమె ఎంత పాపులర్ అనే విషయం కాసేపు పక్కనపెడితే... 2014 లో టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రభుత్వం సమయంలో ఆమె ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారనే విషయంపై కావాల్సినంత చర్చ విత్ రచ్చ జరిగింది. ఆ సంగతి అలా ఉంటే ఆమె తాజాగా జగన్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు.

అవును... "మాయాజాలం" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూనమ్ కౌర్ తదనంతర కాలంలో పలు తెలుగు, తమిళం, హిందీ, మళయాలం సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆమె ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ టార్గెట్ గా నెట్టింట పెట్టే పోస్టులు తీవ్ర వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి నేరుగా పేరు పెట్టి వాయించే ఆమె.. కొన్ని సార్లు పరోక్షంగా సెటైర్లు వేస్తుంటారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చేనేత కార్మికుల విషయంలో జగన్ సర్కార్ అవలంభించిన వైఖరిపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగా... "కోవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా.. ఇది చాలా గొప్ప విషయం" అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ కింద కామెంట్లు మరొకెత్తులా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ కింద దర్శనమిస్తున్న కామెంట్లతో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది! ఈ సందర్భంగా... "ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది" అనే కామెంట్స్ దర్శనమివ్వడం గమనార్హం.

కాగా... కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా రాష్ట్రాలు పేదలకు అందించే పథకాలను ఆపేయగా... ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారనే ప్రశంసలు ఇతర రాష్ట్రాల నేతల నుంచి కూడా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూనమ్ కూడా స్పందించినట్లున్నారు!!

Tags:    

Similar News