జగన్ మా వెంటే...స్టాలిన్ క్లారిటీ !

దేశంలో 2026 నాటికి కొత్తగా లోక్ సభ సీట్లను పునర్ విభజన చేయడానికి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సమాయత్తం అవుతోంది.;

Update: 2025-03-22 13:49 GMT

ఏపీలో వైసీపీ న్యూట్రల్ గా ఉంది. అటు ఇండియా కూటమి వైపు కానీ ఇటు ఎన్డీయే వైపు కానీ లేదు. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ పేరుతో ఒక సంక్లిష్ట సమస్య వచ్చి పడింది. దేశంలో 2026 నాటికి కొత్తగా లోక్ సభ సీట్లను పునర్ విభజన చేయడానికి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సమాయత్తం అవుతోంది.

అయితే జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ చేస్తే కనుక కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది. దీంతో సౌత్ స్టేట్స్ అన్నీ కలిసికట్టుగా ఉండి కేంద్రం వైఖరి మీద పోరాడాలని డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు ఇచ్చారు. ఇవ్వడమే కాదు ఆయన చెన్నైలో డీలిమిటేషన్ మీద కేంద్రం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకుని ఒక మీటింగ్ పెట్టారు.

ఈ మీటింగ్ కి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ అని పేరు పెట్టారు. ఈ మీటింగ్ కి తెలంగాణా నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ హాజరయ్యాయి. ఏపీ నుంచి చూస్తే మాత్రం వైసీపీకి ఆహ్వానం అందినా రాలేదు. అదే సమయంలో జగన్ డీలిమిటేషన్ మీద వైసీపీ స్టాండ్ చెప్పారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అని ఆందోళన ఉందని అలా చేయకుండా చూడాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ లేఖ రాశారు.

ఒక విధంగా డీఎంకే తదితర పార్టీలు డీలిమిటేషన్ విషయంలో వ్యక్తపరుస్తున్న ఆందోళనకు జగన్ సంఘీభావం ఈ లేఖ ద్వారా ప్రకటించినట్లు అయింది దాంతో పాటు ఈ లేఖను కూడా స్టాలిన్ కి వైసీపీ అందచేసింది. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడిన స్టాలిన్ తమ వెంటనే జగన్ కూడా ఉన్నారని ఫుల్ క్లారిటీతో చెప్పారు. అలా అని తాము భావిస్తున్నామని కూడా ఆయన అన్నారు.

ఏపీ నుంచి డీలిమిటేషన్ విషయంలో ఇప్పటిదాకా రియాక్ట్ అయిన తొలి పార్టీ వైసీపీయే. పైగా ఆ పార్టీ ఎన్డీయేకు దూరంగా ఉంది. దాంతో డీఎంకే అధినేత స్టాలిన్ మాతో వైసీపీ కలసివస్తుందని భావించి ఉండొచ్చని అంటున్నారు. అయితే వైసీపీ ఈ విషయంలో కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తూనే లేఖ రాసింది. దక్షిణాదికి అన్యాయం చేయవద్దు అని కోరింది. అదే సమయంలో కేంద్రం మీద ఘాటు విమర్శలు చేయలేదు.

ఇక కేవలం డీలిమిటేషన్ మాత్రమే కాదు జీఎస్టీ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు పంచుతున్న పన్నుల విషయంలో సాగుతున్న వివక్ష మీద కూడా డీలిమిటేషన్ జేఏసీ మీటింగులో మిగిలిన పార్టీలు గొంతెత్తాయి. మరి దీని మీద వైసీపీ స్టాండ్ ఏమిటో చెప్పలేదు. అదే విధంగా చాలా కాలంగా దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ పాలనలో వివక్ష కొనసాగుతోందని జేఏసీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ అభిప్రాయాలు ఏమిటి అన్నవి తెలియవు.

డీలిమిటేషన్ అన్న హాట్ టాపిక్ ని జేఏసీ ఎత్తుకున్నా టోటల్ గా చూస్తే సౌత్ స్టేట్స్ మీద కేంద్రం వివక్ష మీద కలసికట్టుగా పోరాడాలన్నది అజెండా. మరి ఈ విషయంలో వైసీపీ ఎంతవరకు కలసివస్తుందన్నది చూడాల్సి ఉంది. నిజానికి వైసీపీ ఈ కూటమితో కలసి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా పోరాడేందుకు ఏ విధమైన అడ్డంకులు అయితే లేవు.

ఎందుకంటే ఎన్డీయేతో వైసీపీకి ఎలాంటి బంధాలు లేవు. ఫ్యూచర్ లో కూడా కుదిరే చాన్స్ లేదు. మరి లోపాయికారీగా ఉన్నాయని అనుకున్నా అదంత సులువు కాదు. ఏపీలో టీడీపీ జనసేన వైసీపీకి బద్ధ రాజకీయ ప్రత్యర్ధులు. వారిని కాదని బీజేపీ ఏ విధంగానూ వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించేందుకు వీలు లేదు అని అంటున్నారు.

కానీ వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. బయటపడి మోడీ వ్యతిరేక శిబిరంలో చురుకుగా ఉంటే ఆ విపరిణామాలు ఎలా ఉంటాయో అన్న అంచనా వేసుకుని ఇలా చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ మా వైపే అన్న స్టాలిన్ వ్యాఖ్యల మీద ఫ్యాన్ పార్టీ ఎంతవరకూ ఆమోదముద్ర వేస్తుంది అన్నది రానున్న రోజులలో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News