బైడెన్ తెలుగు నేర్చుకోవాలని అనుకుంటున్నాడా..?

Update: 2022-05-28 09:30 GMT
ప్రపంచంలో ఎక్కడ చూసినా కొంతమంది తెలుగువాళ్లు మనకు తారసపడుతారు. అగ్రదేశం అమెరికాలో దాదాపు 80 శాతం తెలుగు తెలిసిన వాళ్లే కనిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు కూడా ఉండడం గర్వకారణం. అమెరికా థింక్ టాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో అమెరికాలో గత ఏడేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని 2021 సంవత్సరంలో తెలిపింది.

దీనిని బట్టి తెలుసుకోవచ్చు అమెరికాలో తెలుగుకున్న ప్రాధ్యాన్యమేంటో. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలుగు భాషపై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలుగులో అందించడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో బైడెన్ తెలుగు పై మక్కువ పడి నేర్చుకోబోతున్నాడా..? అని కొందరు చర్చించుకుంటున్నారు.

తెనే వలె తియ్యగా ఉండే తెలుగు భాష నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. సరళంగా అర్థవంతంగా ఉండే ఈ భాష మాట్లాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న టాప్ 10 భాషల్లో తెలుగు ఉండడం విశేషం. దీంతో ఈ దేశంలో తెలుగువారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

ఇక్కడున్న తెలుగు వారు ఉద్యోగాలు, వ్యాపారాలే కాకుండా రాజకీయాల్లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కొందరు తెలుగువాళ్లు ప్రభుత్వంలో చోటు సంపాదించారు. దీంతో తెలుగువారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని బైడెన్ ఈ నిర్ణయాన్నీ తీసుకోబోతున్నాడు.

తెలుగే కాకుండా అమెరికాలో గుజరాతీ, పంజాబీ వంటి భారతీయ భాషల్లోనూ ప్రభుత్వం సమాచారం అందించనున్నారు. యూఎస్ లో ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సంతతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి అనుగుణంగా సమాచారాన్ని అందించేందుకు స్థానిక భాషల్లో సమాచారం అందించాలని అధ్యక్షుడి సలహా సంఘం సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనకు బైడెన్ ఆమోదం పొందే అవకాశం ఉందని అంటున్నారు.

అమెరికాలో హైదరాబాద్ సాప్ట్ వేర్ ఇంజనీర్లకు భారీగా డిమాండ్ ఉంది. ఇక్కడికి ఇప్పటికే వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చాలా మందే ఉన్నారు. భారత్ నుంచి వస్తున్న వారిలో తెలుగువారికే అమెరికన్లు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ప్రతీ ఏటా వర్క్ వీసాలపై కొన్ని వేల మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలుగువారి సంఖ్య వారి అవసరాలను గుర్తించిన అధ్యక్ష భవనం ప్రభుత్వ సమాచారాన్ని తెలుగులో అందించాలని నిర్ణయించింది.
Tags:    

Similar News