సామాన్యులపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి

Update: 2018-07-26 12:17 GMT
 అధికారం చేతిలో ఉందని టీడీపీ మంత్రులు - నేతలు రెచ్చిపోతున్నారు. సమస్యలపై నిలదీసిన సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మహిళా ఉద్యోగులు -  మహిళా నేతలని కూడా చూడకుండా వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది.

విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని స్థానికులు ఓ టీడీపీ నేతను నిలదీయగా.. బూతు పురాణం మొదలెట్టారు. జిల్లాలోని పార్వతీ పురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీస్..‘మమ్మల్నే నిలదీస్తారా’ అంటూ సామాన్యులపై దాడికి  పాల్పడ్డాడు.

గడిచిన రెండు రోజులుగా వర్షాలకు పార్వతీపురం కుళాయిల్లో బురదనీరు వస్తోంది. దీనిపై స్థానికులు, వైసీపీ నేతలు ఎమ్మెల్సీ జగదీష్ ను ప్రశ్నించారు. అధికార పార్టీ నేతనే ప్రశ్నిస్తారా అని ఆగ్రహంతో ఊగిపోయిన జగదీష్ ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ప్రశ్నించిన వైసీపీ శ్రేణులను కూడా బూతులు తిట్టాడు. స్థానికులపై దూసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి ఎదుటే ఇదంతా జరుగుతున్నా ఆయన మిన్నకుండిపోవడం విమర్శలకు తావిచ్చింది.
Tags:    

Similar News