ర‌చ్చ‌ర‌చ్చ చేసిన అధికార పార్టీ ఎంపీ

Update: 2016-10-29 06:35 GMT

సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డంలో ముందుండే అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో వార్త‌ల్లో నిలిచారు. అయితే ఈ ద‌ఫా వార్త‌ల‌తో కాకుండా త‌న ఆగ్ర‌హంతో జేసీ తెర‌మీద‌కు వ‌చ్చారు. అమ‌రావ‌తిలో ప‌రిపాల‌న న‌గ‌రం కార్య‌క్ర‌మం పూర్తియిన త‌ర్వాత గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న జేసీ  త‌ను ప్ర‌యాణించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే సాయంత్రం 4.45 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం బోర్డింగ్ పూర్త‌యింది. అయితే అందులో ప్రయాణించాల్సిన‌ జేసీ దివాకరరెడ్డి 5.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే విమానం బోర్డింగ్‌ పూర్తి చేసుకుందని మేనేజరు చెప్పడంతో జేసీ నిప్పులు చెరిగారు.

బోర్డింగ్‌ ముగిసిపోయిందని అధికారులు చెప్పడంతో జేసీ దివాక‌ర్ రెడ్డి చిందులు తొక్కారు. విమానం బయలుదేరలేదు కదా.. అవకాశం కల్పించాలని జేసీ అడిగారు. మీ ప్రయాణం లేదని ప్రోటోకాల్‌ వారు చెప్పటంతోనే బోర్డింగ్‌ ముగించినట్లు అధికారులు వివ‌రించారు. పైలెట్‌ ఒక్కసారి డోర్‌ క్లోజ్‌ చేసిన తర్వాత తీయటం అసాధ్యమని చెప్పారు. ఎంపీ అయిన నాకే బోర్డింగ్‌ క్లోజ్‌ అని చెబుతారా? అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కంప్యూటర్‌ ను ధ్వంసం చేయటానికి ప్రయత్నించగా అధికారులు నివారించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్కడకు చేరుకుని ఎంపీ జేసీ దివాకరరెడ్డిని సముదాయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News