N-95 మాస్కులపై కొత్త మార్గదర్శకాలు..ఏంటంటే?

Update: 2020-07-21 05:00 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ సుమారుగా 2 లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ వైరస్ మహమ్మారి నుండి తప్పించుకోవాలంటే, నిత్యం మొహానికి మాస్కు, చేతులకు శానిటైజర్, ఇతరులకు మధ్య  భౌతిక దూరం పాటించడం తప్పనిసరి పరిస్థితి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కరోనా కాటుకి బలి కావాల్సిందే. దీనితో ముఖ్యంగా దాదాపు అన్ని దేశాల్లో పేస్ మాస్క్ వాడటం తప్పనిసరి చేసారు. ఈ నేపథ్యంలో మస్కుల వినియోగంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్ ఎస్ ) సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌  దేశంలోని  అన్ని  రాష్ట్రాల వైద్యాధికారులకు లేఖ రాశారు. వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులతో  పెద్దగా ఉపయోగం లేదని స్పష్టం చేసారు. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్‌ ను  వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులు ఆపలేవని డీజీహెచ్ ఎస్ స్పష్టం చేసింది.  కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం అని , దీనితో ఇకపై  నోరు, ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలని వెల్లడించారు. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసిన నేపథ్యంలో డీజీహెచ్ ఎస్ అన్ని రాష్ట్రాలకి లేఖలు రాసింది.
Tags:    

Similar News