భూకంప తీవ్రతతో మంత్రి గది కదిలిపోయింది

Update: 2016-01-04 05:10 GMT
తాజాగా ఈశాన్య ప్రాంతంలో చోటు చేసుకున్న భూప్రకంపనలకు కేంద్రమంత్రి ఒకరు బాధితులయ్యారు. భూప్రకంపనలు ఎలా ఉంటాయన్న అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు. తెలుగింటి కోడలు.. కేంద్రమంత్రి అయిన నిర్మలా సీతారామన్ ఆదివారం పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు ఆమె అక్కడకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించి.. ఆదివారం సిలిగురిలోని ప్రభుత్వ  గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. హటాత్తుగా గది మొత్తం ఊగిపోయిన పరిస్థితులతో ఆమె ఆందోళనతో బయటకు వచ్చారు. ఫెద్ద ప్రమాదం చోటు చేసుకోనప్పటికీ.. భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఆమె ప్రత్యక్షంగా అనుభవించారు.

తనకు ఎదురైన భూప్రకంపనల అనుభవాన్ని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాను బస చేసిన హోటల్ గది కంపించి పోయిందని.. అయితే.. తామంతా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు.
Tags:    

Similar News