గోదావరి జిల్లాలో ఒకే వ్యక్తి ద్వారా 77 మందికి కరోనా!

Update: 2020-05-27 08:00 GMT
మహమ్మారి ఒక ఊరిపై పగబట్టింది. ఏ గ్రామంలోనూ నమోదు కానీ రీతిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇది గ్రామస్థులను జిల్లాను కూడా వణికిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంపై మహమ్మారి పంజా విసిరింది. పట్టి పీడిస్తోంది. మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్నాయి.

తాజాగా మామిడాడ గ్రామంలో 56 - బిక్కవోలులో 13 - రామచంద్రాపురంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటి పరీక్షల్లో 18మందికి పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా..సోమవారం నాటి పరీక్షల్లో ఏకంగా 9 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపింది.

మామిడాల ఒక్క గ్రామంలోనే  ఇప్పటివరకు ఏకంగా మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భిక్కవోలు మండలం వేలూరులో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News