డైమండ్ రాణి.. ఆ రోజా కూడా నామీద మాట్లాడుతోంది.. : పవన్ సెటైర్లు

Update: 2023-01-13 04:58 GMT
ఇటీవల మెగా ఫ్యామిలీపై, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు రోజా.. కనీసం సొంత జిల్లా వాళ్లకు కూడా ఏమీ చేయలేని ఆ ముగ్గురు మెగా బ్రదర్స్ ను అందుకే సొంత జిల్లాలో ఓడించారని.. ప్రజల కోసం వీళ్లు ఏం ఖర్చు చేయరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలోని రణస్థలం వేదికగా ఏపీ మంత్రి రోజాపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. రోజా గాలి తీసేసేలా కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఓడిపోయినవారిని ఎలా కించపరుస్తారో తెలుసుకదా మీకు.. రెండు చోట్ల ఓడిపోయినోడు.. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడుతదే.. వాళ్లు కూడా.. తూతూ.. నువ్వు కూడానా..ఛీ నా బతుకు చెడ' అంటూ రోజాపై సెటైర్లతో కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

కానీ ఈ మాటలన్నీ పడేది మీకోసమేనండోయ్ అబ్బాయిలూ అంటూ సభకు వివరించారు.

నా కోసం ఇదంతా చేయడం లేదని.. మీ కోసం 'డైమండ్ రాణి' చేత కూడా తిట్టించుకుంటున్నానని సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశిస్తూ పవన్ మాట్లాడాడు. ఆ తర్వాత సంబరాల రాంబాబు అంటూ అంబటిపై పడ్డారు.

ఎవరో వస్తారు.. మంచి రోజులు తెస్తారని అనుకోకండి.. మీ కోసం ఎవరూ రారు.. మంచిరోజులు వాళ్లకు వచ్చాయి.. మట్టి కుండలు మనకు వచ్చాయి అని పవన్ ఈసడించుకుంటున్నారు. మట్టి, మసానం కూడా తినే బ్యాచ్ వైసీపీ అంటూ పవన్ రెచ్చిపోయారు.

ఇక పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో రోజా గురించి కౌంటర్లు ఇవ్వడంతో వేదికపై కూర్చున్న ఆయన బ్రదర్ నాగబాబు నవ్వకుండా ఉండలేకపోయారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ రోజాను పవన్ తిట్టడాన్ని ఎంజాయ్ చేశారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News