'గూగుల్ పే' ను దాటేసిన ఫోన్ పే .. ట్రాన్సాక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ !

Update: 2021-01-20 12:42 GMT
భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్ ‌ బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన ఫోన్‌ పే, గూగుల్ పే కి బాగా అలవాటు పడిపోయారు. క్షణాల్లో నగదు బదిలీ అవకాశం ఉండటం, క్యాష్ రివార్డులు ఇస్తుండటంతో ఈ యాప్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా కారణంగా ప్రజలు నగదుకు బదులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వాడుతున్నారు.

ఫోన్‌ పే యాప్ల ద్వారా ఒక్క డిసెంబర్ నెలలోనే రూ .1.82 లక్షల కోట్ల విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గూగుల్‌ పే ద్వారా రూ .1.76 లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. అంటే యూపిఐ లావాదేవీల్లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న గూగుల్పేను ఢీకొట్టి ఫోన్ ‌పే అగ్రస్థానంలో నిలిచింది.  

డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. అలాగే, నవంబర్‌లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది. అదే గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం (960.02 మిలియన్) లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది.
Tags:    

Similar News