క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘన ..6 నెలల పసికందు - 2 ఏళ్ల పిల్లాడి పై కేసు నమోదు!
దేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో రూల్స్ ను కట్తుదిట్టం చేసారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను విధించిన నేపథ్యంలో ..ఇంట్లో నుండి ఎవరు బయటకి రావొద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కొంతమంది లాక్ డౌన్ నియమాలని పట్టించుకోవడం లేదు. అలాగే కొంతమంది క్వారంటైన్ లో ఉన్నప్పటికీ కూడా క్వారంటైన్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా దేశంలో లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారంటూ 6 నెలల పసికందు, 2 ఏళ్ల వయస్సు పిల్లాడిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర కాశీ జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పసికందు, రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. పసిబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 8 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిపై FIR నమోదు చేయరాదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని మేజిస్ట్రేట్ తెలిపింది. బాలలపై జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం చేసిన జిల్లా కరోనా మేజిస్ట్రేట్ పై క్రమశిక్షణ, సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు ఈ కేసుకు సంబంధించి నివేదికను కూడా డీఎం కోరారు. ఉత్తరాఖండ్ లో మొత్తం కరోనా కేసులు 47 నమోదు కాగా, 24మంది కరోనా బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న 24 మంది వ్యక్తులలో 9 నెలల వయసున్న శిశువు కూడా ఉంది. తబ్లిఘి జమాత్ సభ్యులతో కాంటాక్ట్ అయిన చిన్నారి తండ్రి నుండి 9నెలల శిశువుకు కరోనా వైరస్ సోకింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా దేశంలో లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారంటూ 6 నెలల పసికందు, 2 ఏళ్ల వయస్సు పిల్లాడిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర కాశీ జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పసికందు, రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. పసిబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 8 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిపై FIR నమోదు చేయరాదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని మేజిస్ట్రేట్ తెలిపింది. బాలలపై జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం చేసిన జిల్లా కరోనా మేజిస్ట్రేట్ పై క్రమశిక్షణ, సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు ఈ కేసుకు సంబంధించి నివేదికను కూడా డీఎం కోరారు. ఉత్తరాఖండ్ లో మొత్తం కరోనా కేసులు 47 నమోదు కాగా, 24మంది కరోనా బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న 24 మంది వ్యక్తులలో 9 నెలల వయసున్న శిశువు కూడా ఉంది. తబ్లిఘి జమాత్ సభ్యులతో కాంటాక్ట్ అయిన చిన్నారి తండ్రి నుండి 9నెలల శిశువుకు కరోనా వైరస్ సోకింది.