భర్త షాపింగ్ కు తీసుకెళ్లలేదని భార్య సూసైడ్

Update: 2022-02-07 04:43 GMT
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. విస్మయానికి గురయ్యే దారుణ ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్రాణాలు తీసుకోవటానికి చాలా పెద్ద కారణం ఉంటుందని భావిస్తాం. కానీ.. తాజా విషాద ఉదంతాన్ని చూసినప్పుడు.. ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారా? అన్న సందేహం కలుగక మానదు. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఆత్మహత్య విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఉండే జీడిమెట్లలో అనూహ్య విషాద ఉదంతం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 23 ఏళ్ల శిరీష తాజాగా ఆత్మహత్య చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం మెట్టుకాని గూడకు చెందిన ఒక వ్యక్తిని శిరీష ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఏడాదిన్నర వయసున్న పాప కూడా ఉంది.

అయితే.. ఈ ఇద్దరి మధ్య శనివారం ఒక అంశంపై వాగ్వాదం జరిగినట్లుగా చెబుతున్నారు. భర్తను షాపింగ్ కు తీసుకెళ్లాలని భార్య శిరీష కోరటం.. అందుకు అతడు ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. షాపింగ్ నకు తీసుకెళ్లాలని అడిగినా.. అందుకు నో  చెప్పిన భర్త తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు.

షాపింగ్ కు నో చెప్పారని.. ప్రాణాలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. షాపింగ్ తీసుకెళ్లని భర్త.. తీసుకెళ్లని కారణంగా ప్రాణాలు తీసుకున్న భార్య తీరుతో ఏ పాపం ఎరుగని ఏడాదిన్నర పాపకు తల్లిప్రేమ శాశ్వితంగా దూరమైందని చెప్పాలి.
Tags:    

Similar News