.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

టీమిండియాకు.. టి20ల్లో ఆ ఇద్దరు దిగ్గజాల వారసులెవరు?

అమెరికా, కరీబియన్ దీవుల వేదికగా జరిగిన టి-20 ప్రపంచ కప్ ముగిసింది. భారత అభిమానులకు మధురానుభూతిని మిగిల్చింది

Update: 2024-06-30 15:30 GMT

అమెరికా, కరీబియన్ దీవుల వేదికగా జరిగిన టి-20 ప్రపంచ కప్ ముగిసింది. భారత అభిమానులకు మధురానుభూతిని మిగిల్చింది. పదిహేడేళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ చేతికందడంతో యావత్ భారత దేశం పండుగ చేసుకుంటోంది.. ఈ సందడిలో ఓ చేదు వార్తను మర్చిపోతోంది. సంబరాలు అయిపోయాక గాని.. అదెంతటి చేదు వార్తనో తెలియదు.

ఆ భారం మోసేదెవరు?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. లోతుగా చెప్పాల్సిన అవసరం లేని దిగ్గజ బ్యాటర్లు. ప్రపంచంలోని ఎలాంటి పిచ్ లపై అయినా చెలరేగి ఆడే నైపుణ్యం వీరి సొంతం. టి20 ప్రపంచ కప్ అనంతరం వీరిద్దరూ అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికారు. మరి వీరి స్థానంలో వచ్చేదెవరు? దీనికి సమాధానం.. యువ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్. ఇప్పటికే తామేమిటో నిరూపించుకున్న వీరు ఇకపై టి20ల్లో రోహిత్, కోహ్లి స్థానాల్లో అడుగుపెట్టే వీలుంది. అందులోనూ ఇద్దరూ ఓపెనర్లు కావడంతో కచ్చితంగా వీరే ఆ దిగ్గజాల లోటును భర్తీ చేస్తారని భావించవచ్చు. గిల్, జైశ్వాల్ లను తాజా ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ కు తీసుకెళ్లారు కూడా. ట్రావెల్ రిజర్వ్ గా గిల్ ను ఎంపిక చేసినా.. మధ్యలో ఇంటికి పంపించారు. జైశ్వాల్ కు ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు.

వారికి చాన్స్ లేనట్టేనా..?

అంతా బాగుంటే కనుక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ భారత టి20 జట్టులో ఉండేవారు. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన రికార్డున్న కిషన్ అయితే క్రమశిక్షణ ఉల్లంఘించి జట్టుకు దూరమయ్యడు. కేఎల్ రాహుల్ ను ఎందుకు పరిగణించలేదో తెలియదు. అయ్యర్ కూడా ఇంతే.. వాస్తవానికి ఈ ముగ్గురూ గత ఏడాది భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో జట్టు సభ్యులు. ఇకపైనా అయ్యర్, రాహుల్ లను వన్డేలకు మాత్రమే పరిగణిస్తారేమో చూడాలి. జూలై 6 నుంచి జింబాబ్వేలో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు ఈ ముగ్గురినీ పరిగణించని విషయం గమనార్హం.

Tags:    

Similar News