ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ స్వీట్ సర్ ప్రైజ్

ముందుగా అక్కడ కార్లతో ర్యాలీ చేపట్టారు. ప్రాజెక్ట్ కే పోస్టర్లు పట్టుకొని సందడి చేశారు.

Update: 2023-07-20 10:19 GMT

ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమా పై ఉన్నాయి. ఈ మూవీపై అంచనాలు కూడా చాలా ఉన్నాయి.

కాగా, ప్రాజెక్ట్ కె సినిమా అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మ‌క‌మైన 'శాన్ డియాగో కామిక్ కాన్‌' ఈవెంట్లో పాల్గొన‌నున్న‌ట్లుగా చిత్ర బృదం ప్ర‌క‌టించిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలో జ‌ర‌గ‌నున్న 'శాన్ డియాగో కామిక్ కాన్‌' ఈవెంట్లో 'ప్రాజెక్ట్ కె' టీమ్ అంతా పాల్గొన‌నుంది. ఈ ఈవెంట్‌కు హాజ‌రు కానున్న తొలి భార‌తీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది.

ఈ ఈవెంట్ జులై 20వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అమెరికా చేరుకుంది.ఈ క్రమంలో అక్కడే ఉండే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన కి ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ముందుగా అక్కడ కార్లతో ర్యాలీ చేపట్టారు. ప్రాజెక్ట్ కే పోస్టర్లు పట్టుకొని సందడి చేశారు.

అనంతరం తమ వద్ద ఉన్న కార్లతో కే ఆకారాన్ని క్రియేట్ చేశారు. మొత్తం నలుపు, ఎరుపు, తెలుపు రంగు కార్లను ఉపయోగించి వారు కే చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా,ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్ లుక్ ని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. సూపర్ హీరోలాగా చూపించాలని చూశారు. కానీ, ఈ పోస్టర్ కి పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడం గమనార్హం. ప్రతి ఒక్కరూ ఎడిటింగ్ చీప్ గా ఉంది అంటూ, మూవీని ట్రోల్ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే, ఆదిపురుష్ పరిస్థితే ఈ మూవీకి కూడా పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ టీజర్ పైనే ఉన్నాయి. పోస్టర్ బాగోకన్నా కనీసం టీజర్ అయినా బాగుంటే చాలు అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మూవీ టీజర్ కూడా ఈ ఈవెంట్ లోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అది ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల చేసే వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ , దిశా పటానీ లాంటి వారు నటిస్తుండటం విశేషం.


Full View


Tags:    

Similar News