వెండి తెర‌పై మ‌రో అద్భుతం...ఆ కాంబినేష‌న్ ఇదే!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ. హీరోగా, గాయ‌కుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-03 13:30 GMT

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ. హీరోగా, గాయ‌కుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా నాలుగు విభాగాల్లో రాణించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. హీరోగా ఏటా అభిమానుల ముందుకు సినిమాలు తీసుకొస్తూ....ఏక ధాటిగా నిర్మాత‌గా , డైరెక్ట‌ర్ గా కొన‌సాగ‌డం సాహ‌జ‌మ‌నే చెప్పాలి. ఆ సాహ‌సాన్ని ఎంతో దిగ్విజ‌యంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ డైరెక్ట‌ర్ గా నాలుగు సినిమాలు చేసాడు. `పా పాండి`, `రాయ‌న్` సినిమాలు తెర‌కెక్కించాడు. ప్ర‌స్తుతం మ‌రో రోండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `ఇడ్లీ క‌డై`, ` నిల‌వాక్కు ఎన్ మెల్ ఎన్న‌డి కోబ‌మ్` చిత్రాలు ఆన్ సెట్స్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల‌కు తానే నిర్మాత కూడా. అటు హీరోగా `కుభేర‌`, `ఇడ్లీ క‌డై`తో పాటు బాలీవుడ్ లో `తేరీ ఇష్క్ మే`లోనూ న‌టిస్తున్నాడు. ఇలా న‌టుడిగా, ద‌ర్శ‌కుడి, నిర్మాత‌గా బిజీగా ఉన్నాడు.

మ‌రి ఇంత బిజీలోనూ ధ‌నుష్ స్టార్ హీరో అజిత్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ భారీ సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే నిజ‌మైతే ఇది క్రేజీ కాంబినేష‌న్ అవుతుంది. ఇంత వ‌ర‌కూ ధనుష్ స్టార్ హీరోలెవ‌ర్నీ డైరెక్ట్ చేయ‌లేదు. త‌నని తానే డైరెక్ట్ చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అజిత్ ని డైరెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతుంది.

స్టార్ హీరోలు డైరెక్ష‌న్ చేయ‌డం అన్న‌ది మాలీవుడ్... కోలీవుడ్ లోనే సాధ్యమైంది. మాలీవుడ్ లో పృధ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ పుల్ కెరీర్ చూస్తున్నాడు. ఈ మ‌ధ్య‌నే మోహ‌న్ లాల్ కూడా డైరెక్ట‌ర్ గా లాంచ్ అయ్యాడు. కోలీవుడ్ నుంచి ధ‌నుష్ తో పాటు విశాల్ కూడా డైరెక్ట‌ర్గా ఆస‌క్తి చూపిస్తున్నాడు.

Tags:    

Similar News