టాలీవుడ్ పై 'తాండవం' చేయనున్న అఖిల్?

Update: 2015-08-06 12:55 GMT
అక్కినేని వంశంలో మూడవ తరం నటుడిగా తెరారంగ్రేటం చేయనున్నాడు అఖిల్. మనం లో కనిపించింది కొన్ని సెకన్ల పాటే అయినా తన స్క్రీన్ ప్రెజన్స్ ని చాటుకున్నాడు. తొలి సినిమాతోనే జాక్ పాట్ కొట్టాలన్న తపనతో కమర్షియల్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

యువహీరో నితిన్ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. పలు విదేశాలలో జరిపిన షూటింగ్ షెడ్యూల్స్ తరచూ వార్తలలో నిలిచాయి. విడుదలకు ముందే ఈ సినిమా మంచి బిజినెస్ ని సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'తాండవం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మొదట్లో 'మిసైల్' అనే టైటిల్ ని పరిగణంలోకి తీసుకున్నా చిత్రబృందం 'తాండవం'పైనే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు వున్నాయి.
Tags:    

Similar News