అమితాబ్ బచ్చన్ సీరియస్.. ఆ కంపెనీకి లీగల్ నోటీసులు

Update: 2021-11-21 10:31 GMT
ఓ పాన్ మాసాలా బ్రాండ్ ఉత్పత్తిదారులకు అమితాబ్ బచ్చన్ లీగల్ నోటీసులు పంపారు. వారితో తన కాంటాక్ట్ రద్దు అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఆ సదురు పాన్ మసాలా ప్రొడక్ట్ ను ప్రచారం చేసుకునేందుకు... అడ్వర్టైజ్ మెంట్స్ ప్రసారం చేయడంపై అమితాబ్ బచ్చన్ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

గతంలో అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించారు. ఆ యాడ్ లోనూ నటించారు. అయితే ఆ తర్వాత విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి రద్దు చేస్తున్నారు. అయినా ఆ కంపెనీ అమితాబ్ యాడ్ ను వాడేస్తోంది. ఇంకా టీవీల్లో ప్రసారం చేస్తోంది.

ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తిని అమితాబ్ ప్రచారం చేయటంపై ఆన్ లైన్ లో పలు విమర్శలు వచ్చాయి. వాటికి ఓ పొగాకు వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా అభ్యర్థించడంతో అడ్వర్టైజ్ మెంట్స్ కాంట్రాక్ట్ ను అక్టోబర్ నెలలో అమితాబ్ బచ్చన్ టెర్మినేట్ చేసేశారు.

అయితే ఒప్పందం రద్దు అయినప్పటికీ పాన్ మసాలా కంపెనీ మాత్రం అమితాబ్ బచ్చన్ కనిపించే యాడ్స్ ను ఇంకా ప్రసారం చేస్తూనే ఉంది. అందుకే అమితాబ్ లీగల్ నోటీసులు పంపించారని బాలీవుడ్ టాక్.
Tags:    

Similar News