ఆ కేసులో ధనుష్ కి పెద్ద రిలీఫ్

Update: 2017-03-21 07:28 GMT
తన పుట్టుకకు సంబంధించిన మొదలైన వివాదంతో కొన్ని నెలలుగా మనో వేదన అనుభవిస్తున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కు పెద్ద రిలీఫ్ వచ్చినట్లే. మధురైకి చెందిన కదిరేశన్.. మీనాక్షి దంపతులు చెబుతున్నట్లు ధనుష్ వారి కొడుకు కాదని మెడికల్ రిపోర్టుల్లో తేలింది. ఆ దంపతులు ధనుష్ ఎడమ కాలర్ బోన్ దగ్గర పుట్టు మచ్చ లేదని.. ఎడమ మోచేతిపై గాయం లాంటిదేమీ లేదని వైద్య నివేదికల్లో తేలింది. దీంతో ధనుష్ వారి కొడుకే అనడానికి ఆధారాలు లేనట్లే. కాబట్టి ఈ కేసు తీర్పు ధనుష్ కు అనుకూలంగా వచ్చేందుకు అవకాశముంది. ఇంకా క్లారిటీ కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు వెళ్లే అవకాశముంది.

ధనుష్ పుట్టుమచ్చల్ని సర్జరీ ద్వారా తొలగించేసినట్లు ముందుగా రూమర్లు వినిపించాయి కానీ.. తర్వాత అదంతా ఉత్త ప్రచారమే అని తేలింది. ధనుష్ తమ కొడుకే అని తను స్కూల్లో చదువుకునే రోజుల్లో సినిమా పిచ్చితో ఇంటి నుంచి పారిపోయాడని కదిరేశన్ దంపతులు అంటున్న సంగతి తెలిసిందే. ధనుష్ తమ కొడుకేనని నిర్ధరించి.. వృద్ధాప్యంలో ఉన్న తమకు నెలకు రూ.65 వేల చొప్పున భత్యం ఇప్పించాలని వారు కోరుతున్నారు. మామూలుగా ఇలాంటి ఆరోపణలు ఆరంభంలోనే వీగిపోతాయి కానీ.. కేసు మద్రాస్ కోర్టు వరకు వచ్చి.. చాన్నాళ్ల పాట విచారణ సాగడంతో ఇందులో ఏదో మతలబు ఉందనే అంతా అనుకున్నారు. కానీ వైద్య నివేదికల్ని బట్టి చూస్తుంటే ఈ కేసు త్వరలోనే తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News