అజిత్ సినిమాకు ఏపీలో బిగ్ షాక్

Update: 2022-02-16 08:30 GMT
కోవిడ్ కార‌ణంగా చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాల రిలీజ్ లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ప‌రిస్థితులు మారిపోవ‌డం.. క‌రోనా... ఒమిక్రాన్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో భారీ చిత్రాలు వ‌రుస‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోతున్నాయి. భీమ్లా నాయ‌క్‌.. ఆర్ ఆర్ ఆర్‌.. రాధేశ్యామ్‌.. వంటి భారీ చిత్రాల‌తో పాటు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీప‌డుతున్నాయి. దీంతో మునుపెన్న‌డూ లేనంత‌గా భారీ చిత్రాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతోంది.

తాజా ప‌రిణామాల నేఫ‌థ్యంలో త‌మిళ స్టార్ హీరో అజిత్ చిత్రానికి ఏపీలో బిగ్ షాక్ త‌గిలిన‌ట్టుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ స్టార్ హీరో త‌లా అజిత్ న‌టిస్త‌న్న తాజా చిత్రం `వ‌లిమై`. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి `ధీర‌న్ అధిగారం (ఖాకీ) - నేర్కొండ పార్వై (పింక్ రీమేక్‌) వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని అందించిన హెచ్ . వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 24న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

రేసీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ ద్వారా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ త‌మిళ తెర‌కు విల‌న్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ యాక్ష‌న్ ప్రియుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. అంతే కాకుండా హీరో అజిత్ కి పోటా పోటీగా కార్తీకేయ క్యారెక్ట‌ర్ ని మ‌లిచిన తీరు, స్టైలిష్ విల‌న్ గా అత‌న్ని ఆవిష్క‌రించిన విధానం తెలుగు ప్రేక్ష‌కులని అమితంగా ఆక‌ట్టుకుంది. దీంతో ఈ మూవీపై త‌మిళంతో పాటు తెలుగులో నూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌టుడిగా త‌న మార్కెట్ స్థాయిని పెంచే సినిమా కావ‌డంతో హీరో కార్తికేయ ఈ మూవీ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడ‌ట‌. అంతే కాకుండా త‌మిళంలో అత‌నికి భారీ క్రేజ్ ని తీసుకొచ్చే ప్రాజెక్ట్ అవుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నా కార్తికేయ ఈ మూవీ రిజ‌ల్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడ‌ని చెబుతున్నారు. తెలుగులో వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా డైల‌మాలో వున్న కార్తికేయ‌కు `వ‌లిమై` హిట్ ఫుల్ క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని, ఆ కార‌ణంగానే త‌ను ఈ ప్రాజెక్ట్ ఫ‌లితంపై భారీ హోప్ పెట్టుకున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

అయితే కార్తీకేయ ఆశ‌ల‌కు ఏపీలో బిగ్ షాక్ ఎదుర‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. `వ‌లిమై` ఫిబ్ర‌వ‌రి 24న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. అయితే ఈ చిత్రానికి ఏపీలో థియేట‌ర్లు ల‌భించ‌డం లేద‌ని, ఇది కార్తికేయ‌కు బిగ్ షాక్ గా మార‌బోతోంద‌ని తెలుస్తోంది. భారీగా తెలుగు చిత్రాలు విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో త‌మిళ డ‌బ్బింగ్ చిత్ర‌మైన `వలిమై`కి థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌డం నిజంగా కార్తికేయ బ్యాడ్ ల‌క్ అంటున్నారు
Tags:    

Similar News