నిన్న షారుఖ్‌.. ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్‌..!

Update: 2022-10-29 11:30 GMT
గ‌త కొన్ని నెల‌లుగా బాలీవుడ్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాది చిత్రాల‌కు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్ తో సంబంధం లేకుండా కంటెంట్ న‌చ్చితే కాసుల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌లైన పుష్ప‌, 'RRR', కేజీఎఫ్ 2, కార్తికేయ 2'..తాగా క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి న‌టించి రూపొందించిన 'కాంతార‌' వంటి సినిమాల‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ లోనూ ద‌క్షిణాది ప‌ట్ల ఆస‌క్తి మొద‌లైంది.

ద‌క్షిణాదికి చెందిన క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని ఆరా తీయ‌డంమొద‌లు పెట్టారు. 'పుష్ప‌' త‌రువాత సుకుమార్ తో సినిమాలు చేయాల‌ని అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్స్ ఆరా తీయ‌డం తెలిసిందే. స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ సినిమా చేస్తాన‌ని చెప్ప‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుఖ్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ కూడా ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు.

ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ డైరెక్ష‌న్ లో 'జ‌వాన్‌' మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై షారుఖ్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే అట్లీ కుమార్ తో క‌లిసి సినిమా చేయాల‌ని స‌ల్మాన్ ఖాన్ కూడా ఆస‌క్తిని చూపిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌లే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరితే అట్లీతో స‌ల్మాన్ ఖాన్ మూవీ ఫైన‌ల్ అయిన‌ట్టే అంటున్నారు. సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌' మూవీలో న‌టిస్తున్నాడు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'వీర‌మ్‌' ఆధారంగ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News