జై ల‌వ‌కుశ నుంచి ఆయ‌న త‌ప్పుకున్నాడు

Update: 2017-05-15 18:02 GMT
ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై ల‌వ‌కుశ’ నుంచి ఓ కీల‌క టెక్నీషియ‌న్ త‌ప్పుకున్నాడు. ఈ సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా ఎంపికైన ముర‌ళీధ‌ర‌న్.. రెండు షెడ్యూళ్ల త‌ర్వాత అనుకోకుండా త‌ప్పుకున్నాడు. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ)తో అభిప్రాయ భేదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మొద‌ట్నుంచి ముర‌ళీధ‌ర‌న్ కు.. బాబీకి ప‌డ‌ట్లేద‌ని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇద్ద‌రి వ‌ర్కింగ్ స్టైల్స్ భిన్న‌మైన‌వి కావ‌డంతో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయ‌లేక‌పోయార‌ని.. చివ‌రికి రెండు షెడ్యూళ్ల త‌ర్వాత ముర‌ళీద‌ర‌న్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నాడ‌ని స‌మాచారం.

ముర‌ళీధ‌ర‌న్ హిందీలో ‘3 ఇడియ‌ట్స్’.. ‘పీకే’.. ‘మొహెంజ‌దారో’ లాంటి భారీ సినిమాల‌కు ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. ఆయ‌న జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నారు. ఇలాంటి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు ఎన్టీఆర్ సినిమాకు ప‌ని చేస్తున్నాడ‌ని నంద‌మూరి అభిమానులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. ముర‌ళీధ‌ర‌న్ స్థానంలో టాలీవుడ్ సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కే నాయుడు ప్ర‌స్తుతం ‘జై ల‌వ‌కుశ’ ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే కొత్త షెడ్యూల్ షూటింగ్ న‌డుస్తోంది.బాబీ.. ఛోటాతో ప‌ని చేయ‌నుండ‌టం ఇదే తొలిసారి. మ‌రి మ‌ధ్య‌లో వేరే సినిమాటోగ్రాఫ‌ర్ వ‌చ్చిన నేప‌థ్యంలో సినిమాలో ఫ్రేమ్స్ ఏమైనా వేర్వేరుగా ఉంటాయేమో చూడాలి.
Tags:    

Similar News