ఆ స్టార్ హీరోని 'ఆంటీ' అని పిలుస్తా: పూజా హెగ్డే

Update: 2022-03-19 23:30 GMT
టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదురైనా.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన 'దువ్వాడ జగన్నాథం'తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకోవ‌డంతో పాటు వ‌రుస హిట్ల‌నూ ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ఇక చివ‌రిగా ఈ బుట్టుబొమ్మ 'రాధేశ్యామ్‌'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ వింటేజ్ ప్రేమ క‌థా చిత్రం మార్చి 11న విడుద‌లై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ‌త కొంత కాలం నుంచి వరుస విజయాల‌తో దూసుకుపోతున్న‌ పూజాకు 'రాధేశ్యామ్‌' రూపంలో బిగ్ ఫ్లాప్ ప‌డింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీమె న‌టించిన‌ మ‌రో పెద్ద సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అదే 'సర్కస్'.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కామెడి ఎంటర్టైనర్ చిత్ర‌మిది. ఇందులో పూజా హెగ్డే, జాక్వెలిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ షేర్ చేసుకుంది.

అలాగే ర‌ణ‌వీర్ సింగ్‌ను 'అంటీ' అని పిలుస్తా అంటూ సీక్రెట్ కూడా రివీల్ చేసింది. పూజా మాట్లాడుతూ.. 'సెట్స్‌లో రణవీర్ సింగ్ ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తనని నేను 'పమ్మీ ఆంటీ' అని పిలుస్తాను. ఎందుకంటే, పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నా సరే అత‌ను తనదైన పంచ్‌లతో నవ్వుల్ని పంచుతాడు.

రణవీర్ ఎక్కడ ఉంటే అక్కడంతా సంద‌డి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే స‌ర్క‌స్ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని.. ఇందులో త‌మ జంట ఎంతో చూడముచ్చట‌గా క‌నిపిస్తుంద‌ని కూడా ఆమె పేర్కొంది.

కాగా, పూజా హెగ్డే ఇత‌ర ప్రాజెక్ట్‌ల విష‌యానికి వ‌స్తే.. ఈమె న‌టించిన 'ఆచార్య‌' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా ఫిక్సైంది. త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో ఈమె చేసిన 'బీస్ట్‌' త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.
Tags:    

Similar News