పిక్ టాక్‌ : సూపర్ స్టార్‌ షేర్ చేసిన ఇంట్రెస్టింగ్‌ ఓల్డ్‌ ఫోటో

Update: 2022-07-30 02:30 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆయన సందర్భానుసారంగా మాత్రమే ఫోటోలను షేర్‌ చేస్తూ.. ఏదైనా విషయం అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ ఉంటాడు.

తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన సూపర్‌ స్టార్‌ అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ పాత ఫోటో షేర్‌ చేసిన రజినీకాంత్‌ ఫ్యాన్స్ కు విభిన్నమైన ట్రీట్ ను ఇచ్చాడు.

ప్రస్తుతం తమిళనాడు చెన్నై లో చెస్ ఒలింపియాడ్‌ 2022 జరుగుతున్న విషయం తెల్సిందే. చెస్ ఛాంపియన్స్ మొత్తం ప్రస్తుతం చెన్నై వైపు చూస్తున్న నేపథ్యంలో రజినీకాంత్‌ గతంలో తాను చెస్ ఆడుతున్న సమయంలో తీసుకున్న ఫోటోను షేర్‌ చేశాడు. నాకు ఇష్టమైన ఇండోర్ గేమ్స్ లో చెస్ అత్యంత ఇష్టమైన గేమ్‌.

చెస్ ఒలింపియాడ్ 2022 లో పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రజినీకాంత్ షేర్‌ చేసిన ఈ ఫోటోకు దాదాపుగా లక్ష రియాక్షన్స్ వచ్చాయి. రజినీకాంత్‌ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నారు. ఆయన సింప్లిసిటీ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆయన అభిమానులు ట్వీట్స్ కి రిప్లై ఇస్తున్నారు.

ఇక రజినీకాంత్‌ సినిమాల విషయానికి వస్తే చాలా అంచనాల నడుమ రూపొందిన  అన్నాత్తే సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. తమిళనాట ఆడిందని.. వసూళ్లు సాధించిందని ప్రచారం జరిగినా అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు అంటూ కొందరు రజినీకాంత్‌ అభిమానులు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రజినీకాంత్‌ అభిమానులు సూపర్‌ స్టార్ స్థాయికి తగ్గ హిట్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News