'అభయ్-భార్గవ్'ల క్యూట్ ఫోటోలతో ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్..!!

Update: 2020-12-25 11:44 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫెస్టివల్స్ సందర్బంగా అభిమానులకు గ్రీటింగ్స్ మాత్రం పక్కా తెలియజేస్తాడు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్బంగా ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపాడు. తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ ల పిక్ పోస్ట్ చేసి మేరీ క్రిస్మస్ అంటూ ట్రీట్ ఇచ్చాడు. అయితే ఆ పోస్ట్ లో అభయ్ రామ్.. భార్గవ రామ్ ను ముద్దాడటం, భార్గవ్ అభయ్ ని ముద్దాడటం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఎంతో క్యూట్ గా ఉన్న ఇద్దరు ఎన్టీఆర్ వారసులను చూస్తూ నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం అభయ్, భార్గవ్ ల క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రౌద్రం రణం రుదిరం' మల్టీస్టారర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. ఇక ఇందులో ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ కూడా నటిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ బాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం నందమూరి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అయినను పోయిరావలె హస్తినకు' అనే సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మరికొన్ని చర్చల దశలో ఉన్నాయట. చూడాలి మరి ఎన్టీఆర్ ఈ ఏడాది ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడో..!!
Tags:    

Similar News