పవన్ కళ్యాణ్ కోసం మహేష్ స్పెషల్ షో?

Update: 2022-05-26 10:30 GMT
టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అనేక రకాల విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ కూడా చాలా బలంగా నమ్ముతోంది.

ఇప్పటికే సినిమా ట్రైలర్ అయితే ఓ వర్గం ప్రేక్షకులకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఆడియెన్స్ కు తప్పకుండా మొదటిరోజు మొదటి షో చూడాలి అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు విడుదలకు పది రోజుల ముందే కొన్ని అడ్వాన్స్ ప్రీమియర్స్ షోలను కూడా ప్రదర్శించడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో సెలబ్రిటీల కోసం కూడా ప్రత్యేకంగా షోలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఈ రోజుల్లో కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలను బడా హీరోలు కూడా చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మేజర్ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం మహేష్ బాబు, అడవి శేష్, నమ్రత శిరోద్కర్ ప్రత్యేకంగా స్పెషల్ షోకు ప్లాన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఇటీవల అడవి శేష్ అయితే ఒక నెటిజన్ల అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా స్పెషల్ షో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు.

ఈ సినిమాను సోనీ పిక్చర్స్ తో పాటు మహేష్ బాబు తన హోమ్ బ్యానర్ GMB ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మహేష్ బాబు కేవలం కథ విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు వెనకాల మొత్తం ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ అన్నీ చూసుకున్నారు.

ఇక ఇప్పుడు వీరికి సంబంధించిన AMB సినిమాస్ లోనే మేజర్ సినిమాను పవన్ కళ్యాణ్ కు చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే తప్పకుండా సినిమా పై మరింతగా హైప్ పెరగడం ఖాయం. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News