ఆ గట్ ఫీలింగ్ తోనే ఓకే చేశాను!

Update: 2022-06-02 04:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కార్ వారి పాట సినిమా తో పరవాలేదు అనిపించే విధంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తియేట్రికల్ గా పూర్తి స్థాయిలో పెట్టిన పెట్టుబడి వెనక్కి తేలేకపోయినప్పటికీ ఒక విధంగా నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నారు అని చెప్పాలి.

ఇక ఇటీవల కాలంలో మహేష్ ఏది పట్టుకున్నా బంగారమే అవుతోంది. ఆ విషయంపై మహేష్ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.

అయితే మహేష్ మొదటి సారి నిర్మాతగా మరో యువ హీరో తో సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది. అడవి శేష్ నటించిన మేజర్ ను మహేష్ తన GMB ప్రొడక్షన్స్ పై నిర్మించిన విషయం తెలిసిందే. శశికిరణ్ టిక్క దర్శకత్వంలో ఈ సినిమాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అడవి శేష్ ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా కనిపించాడు.

ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాకు ఒక నిర్మాతగా తాను చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. ప్రమోషన్స్ లో కూడా గట్టిగానే పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా విజయంపై మహేష్ బాబు నమ్మకం అయితే మామూలుగా లేదు. చాలా గ్రేట్ ఫీలింగ్ తో ఉన్నట్లుగా తెలియజేశాడు. సినిమా స్క్రిప్ట్ దశలోనే తనకు చాలా నమ్మకం ఏర్పడింది అని ఆ గట్ ఫీలింగ్ తోనే ఓకే చేశాను అని అన్నాడు.

అంతే కాకుండా ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే కూడా పూర్తి బాధ్యత తనదీ అని కూడా మహేష్ వివరణ ఇచ్చాడు. మహేష్ బాబు తో పాటు ఈ సినిమాను సోనీ పిక్చర్స్ కూడా నిర్మించింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అందరి లో కూడా ఒక బలమైన నమ్మకం కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేకమైన ప్రీమియర్ షోలను కొన్ని రాష్ట్రాల్లో ప్రదర్శించారు. వాటికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెల 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News