మరోసారి సర్‌ ప్రైజ్‌ కు సిద్దమయ్యాడు

Update: 2021-10-03 02:30 GMT
తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్‌. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా విజయ్‌ సేతుపతి నటిస్తూ ఉన్నాడు. మాస్టర్ సినిమాలో ఈయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మాస్టర్ లో విజయ్ సేతుపతి లుక్ కు అంతా ఫిదా అయ్యారు. ఏ పాత్ర వేసినా.. ఏ మేకోవర్ లో అయినా కూడా విజయ్‌ సేతుపతి కనిపించే తీరు అద్బుతం అన్నట్లుగా అభిమానుల నుండి టాక్ దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ తో పాటు ఇప్పుడు అన్ని వుడ్ ల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు లో ఉప్పెన తర్వాత ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. ఉప్పెన లో రాయనం పాత్రతో సర్‌ ప్రైజ్ చేశాడు. తన ప్రతి సినిమాలోని పాత్రతో సర్ ప్రైజ్‌ చేసి విజయ్‌ సేతుపతి మెట్రో డిలక్స్ లో ట్రాన్స్ జెండర్ గా కనిపించిన విషయం తెల్సిందే.

ఇప్పుడు మరోసారి సర్‌ ప్రైజ్‌ చేసేందుకు గాను విజయ్‌ సేతుపతి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి తాజాగా పిసాసు 2 సినిమాలో గెస్ట్‌ గా నటించేందుకు ఓకే చెప్పాడు. ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి చాలా విభిన్నంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్‌ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా పిసాసు 2 లో తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యత మరియు గెటప్ నేపథ్యంలో సినిమా ను చేసేందుకు గాను ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పిసాసు చిత్రంలో హీరోగా నటించకున్నా కూడ ఆ కథ మొత్తం కూడా విజయ్‌ సేతుపతి చుట్టు తిరుగుతుందని.. కథలో ఆయనది గెస్ట్‌ పాత్ర అయినా కూడా గెటప్ తో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. హర్రర్ సినిమా అయిన పిసాసు 2 తో ప్రేక్షకులు భయపెట్టేందుకు సిద్దం అయ్యారు. 2014 లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ గా రూపొందుతున్న పిసాసు 2 ను అతి త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఆండ్రియా జెర్మియా మరియు రాజ్ కుమార్ పూర్ణలు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా లో బిగ్‌ ట్విస్ట్‌ ఉంటుంది.. ఆ ట్విస్ట్‌ తో విజయ్ సేతుపతి సర్‌ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.
Tags:    

Similar News