ఈ విధంగా రెచ్చగొడితే కుర్రాళ్లు ఏమవ్వాలి శ్రీవల్లి?

Update: 2022-03-09 10:30 GMT
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగు సినిమా పరిశ్రమలో ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చి గీత గోవిందంతో స్టార్‌ డమ్‌ దక్కించుకుని వరుసగా సినిమాలు చేసేంతటి స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ప్రస్తుతం రష్మిక మందన్నా పలు సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమాల్లో ఈమె నటనతో ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా ఈమె నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలోని శ్రీవల్లి పాత్ర కు మంచి పేరు దక్కడంతో పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కింది. రికార్డులు బ్రేక్‌ అయ్యేంతటి వసూళ్లను దక్కించుకున్న పుష్ప సినిమా తో రష్మిక మందన్నా స్టార్‌ డమ్‌ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనడంలో సందేహం లేదు. అందుకే ఆమె ఆ స్థాయి ఎక్స్ పోజింగ్‌ కు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఇలా క్లీ వేజ్ షో చేస్తూ మతులు పోగొట్టేస్తుంది. ఇలాంటి ఫోటోలు షేర్‌ చేస్తే జనాలు ఏమై పోవాలి అంటూ సున్నితంగా ఈమెను అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. ఇంత అందం ను తట్టుకోలేక కుర్రకారు కింద పడిపోతే బాధ్యత ఎవరిది అంటూ సరదా కామెంట్స్ చాలా వస్తున్నాయి.

ఇంతటి హాట్‌ షో ను బాలీవుడ్ స్టార్స్ మాత్రమే చేస్తారు. కనుక పుష్ప సినిమా తో పూర్తి స్థాయి బాలీవుడ్‌ హీరోయిన్‌ గా మారిపోయినట్లేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే. ఈమద్య కాలంలో సౌత్‌ ముద్దుగుమ్మలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కనుక రష్మిక మందన్నా అభిమానులు ఈ ఫోటో షూట్స్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇక రష్మిక తాజాగా శర్వానంద్‌ తో కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయినా కూడా రష్మిక క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు ఇప్పటికే నిలిచింది. ముందు ముందు ఈమె ఉత్తర భారతంలో కూడా బిజీ అయ్యేలా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో బిజీ అయితే ఇక్కడ సినిమాలు తగ్గిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News