'గుంటూరు కారం' బ్యాక్ టు బ్యాక్‌...!

గత వారం రోజులుగా బ్యాక్ టు బ్యాక్‌ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Update: 2023-08-24 12:45 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ మెల్లగా సాగుతుందని, కచ్చితంగా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు లేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల మహేష్ బాబు ఒక మీడియా సమావేశంలో గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వస్తుందని ప్రకటించాడు.

గత వారం రోజులుగా బ్యాక్ టు బ్యాక్‌ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇంటర్వెల్‌ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరిగింది. వారం రోజుల్లో అనుకున్న షెడ్యూల్ కేవలం నాలుగు రోజుల్లోనే ముగించారట. నిన్న ఇంటర్వెల్‌ సీన్స్ పూర్తి చేసిన మహేష్ బాబు వెంటనే కొత్త షెడ్యూల్ కి రెడీ అయ్యాడు.

కొత్త షెడ్యూల్‌ లో హైదరాబాద్‌ లోని సారథి స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగబోతుంది. ఈ షెడ్యూల్‌ లో మహేష్ బాబుకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బ్రేక్ తీసుకోకుండా, బ్యాక్ టు బ్యాక్‌ షెడ్యూల్స్ లో సినిమాను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మరో కీలక పాత్రలో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెల్సిందే. మలయాళ స్టార్‌ నటుడు జయరామ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News