నిర్మాత‌గా హీరోయిన్ సీరిస్ నెంబ‌ర్ వ‌న్!

ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఈ సిరీస్ అన్ని భాష‌ల్లోనూ అమెజాన్ లో అందుబాటులోకి వ‌చ్చింది.

Update: 2024-02-25 07:55 GMT

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ నిర్మాత‌గానూ స‌క్సెస్ లో దూసుకుపోతుంది. గ‌తేడాది డార్లింగ్స్ తో నిర్మాత‌గా ప‌రిచ‌యం అయిన అలియా తొలి ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలో అలియా విజ‌య‌కేతనం ఎగ‌రేసింది. అమెజాన్ తో క‌లిసి అమ్మ‌డు `పోచ‌ర్` అనే వెబ్ సిరీస్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఈ సిరీస్ అన్ని భాష‌ల్లోనూ అమెజాన్ లో అందుబాటులోకి వ‌చ్చింది.


దీంతో తొలి రోజు పోచ‌ర్ రికార్డు సృష్టించింది. అన్ని భాష‌ల్లోనూ ఈ సిరీస్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. రిలీజ్ రోజునే ఇండియాలోనే అత్య‌ధికంగా వీక్షించిన సిరీస్ గా రికార్డు సృష్టించింది. గ‌త రికార్డుల‌న్నింటిని పోచ‌ర్ తిర‌గ‌రాసింది. ఈ సంద‌ర్భంగా అలియాభ‌ట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేసింది. `మంచి రెస్పాన్స్ ఎంతో ఆనందాన్నిస్తుంది. రిలీజ్ రోజే నెంబ‌వ‌న్ గా నిలిచింది. ప్ర‌స్తుతం కూడా టాప్ పోజిష‌న‌ల్ కొన‌సాగుతుంది.

సిరీస్ ఇంకా చూడ‌ని వారంతా త‌ప్ప‌కుండా చూడండి. మంచి థ్రిల్ దొరుకుతుంది. మంచి కంటెంట్ ని ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారని నా విష‌యంలోనూ రుజువైంది` అని తెలిపింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ చాలా ఆస‌క్తిగానూ అనిపిస్తుంది. 2015 బ్యాక్ డ్రాప్ లో సాగే సిరీస్ ఇది. నిమిషా సైజ‌యాన్ (మాల‌) తండ్రి చేసిన పాపానికి ప‌రిహారంగా అడ‌విలోని వ‌న్య‌మృగాల్ని ర‌క్షించాల‌నుకుంటుంది.

ఏనుగు దంతాల కోసం 18 ఏనుగుల్ని చంపేసారు అన్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో మాల షాక్ అవుతుం ది. ఇది మూల క‌థ అక్క‌డ నుంచి క‌థ ఎలా సాగింది అన్న‌ది ఆస‌క్తిక‌రం. నిమిషా స‌జ‌య‌న్...రోష‌న్ మ్యాథ్యూ..దివేంద్రు భ‌ట్ట‌చార్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్ ఇది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    

Similar News