మీరు గర్వపడే సినిమాలు చేస్తా..!

యువ హీరో కిరణ్ అబ్బవరం ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తున్నాడు.

Update: 2023-10-01 05:08 GMT

యువ హీరో కిరణ్ అబ్బవరం ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ గా రూల్స్ రంజన్ అంటూ మరో ప్రయత్నం చేశాడు కిరణ్ అబ్బవరం. రూల్స్ రంజన్ సినిమాను ఏ ఎం రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తన స్పీచ్ తో ఫ్యాన్స్ ని అలరించాడు.

సినిమా తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని.. ఈ సినిమాకు అంతా చాలా బాగా కష్టపడి పనిచేశారని చెప్పారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ గురించి చెప్పిన కిరణ్ అబ్బవరం ఈ సినిమా అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరారు. మూడేళ్లలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. సినిమాలు కొన్ని సక్సెస్ లు ఫెయిల్యూర్స్ అవుతున్నాయని ఒక్క సంవత్సరం లో మీ అందరినీ గర్వపడేలా సినిమాలు చేస్తానని అన్నారు కిరణ్ అబ్బవరం.


ఆది చెప్పినట్టుగా సినిమాకు రివ్యూస్ ఇచ్చే వాళ్లు, మీమ్స్, ట్రోల్స్ చేసే వాళ్లు కూడా సినిమా పరిశ్రమలో భాగమే. సినిమా గురించి మాట్లాడే వారంతా తన సినిమా గురించి మాట్లాడొచ్చు అయితే కొన్ని విషయాలు ఒక్కోసారి సినిమాపై ప్రభావం చూపిస్తాయి. తనని వ్యక్తిగతంగా ఏమన్నా పెద్దగా పట్టించుకోను కానీ సినిమా మీద ఆ ప్రభావం పడకూడదని కోరుకుంటానని అన్నారు కిరణ్ అబ్బవరం. ట్రోల్స్ గురించి తాను అసలు పట్టించుకోనని.. ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ ఒక భాగమే అని అన్నారు కిరణ్ అబ్బవరం.

సినిమాలో ఆది, సుదర్శన్, వైవా హర్ష, వెన్నెల కిశోర్ వీరంతా తనకు బాగా సపోర్ట్ చేశారని. ఏ.ఎం రత్నం బ్యానర్ సమర్పణలో తన సినిమా రావడం సంతోషంగా ఉందని. డైరెక్టర్ రత్నం కృష్ణ చాలా బాగా ఈ సినిమా చేశారని అన్నారు. అక్టోబర్ 6న సినిమా చూసి ఆదరించాలని.. కచ్చితంగా మీ అందరు గర్వపడే సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి మాట ఇచ్చారు కిరణ్ అబ్బవరం. ఏ.ఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లావణ్య, మురళి కృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు అమ్రీష్ సంగీతాన్ని అందించారు.




Tags:    

Similar News