వాళ్లకి లీగల్‌ నోటీసులు ఇచ్చిన ప్రభాస్‌ హీరోయిన్‌

ఇప్పటికే తన గురించి తప్పుడు కథనాలు రాసి, ట్రేడింగ్ యాప్స్ కి తాను మద్దతు తెలిపినట్లుగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్దమైనట్లుగా ఆమె పేర్కొంది.

Update: 2023-12-08 06:12 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ గా నటించి, ఇక్కడ మంచి ఆఫర్లు.. హిట్స్ పడక పోవడంతో ఉత్తరాదికి షిప్ట్‌ అయిన కృతి సనన్‌ అక్కడ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో నిలిచిన ఈ అమ్మడు ఇటీవల ప్రభాస్ కు జోడీగా ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రలో నటించి మెప్పించింది.


తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా జానకి పాత్రలో కృతి సనన్‌ ని స్వీకరించారు. ఆమె తన నటనతో మెప్పించింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఇటీవల ఒక టాక్‌ షో లో పాల్గొన్న ఈ అమ్మడు ట్రేడింగ్‌ యాప్స్‌ ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు అంటూ చాలా మీడియా సంస్థలు కథనాలు రాయడం జరిగింది.

ఆ కథనాలపై కృతి సనన్ సీరియస్‌ అయింది. తాను చేసిన వ్యాఖ్యలను, చెప్పని విషయాలను ఎందుకు తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే తన గురించి తప్పుడు కథనాలు రాసి, ట్రేడింగ్ యాప్స్ కి తాను మద్దతు తెలిపినట్లుగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్దమైనట్లుగా ఆమె పేర్కొంది.

పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించడం ద్వారా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు అయింది. ముందు ముందు తన గురించి తప్పుడు కథనాలు రాసిన వారికి కచ్చితంగా మరింత కఠినంగా చర్యలు తీసుకుంటాను అన్నట్లుగా కూడా కృతి సనన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మాత్రం సీరియస్‌ గా లేకుంటే ఇష్టానుసారంగా రాసేస్తారని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కృతికి మద్దతుగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News