మ‌హేష్ మూవీలో ఇండోనేషియా బ్యూటీ?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-26 11:24 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికను రాజమౌళి ఇప్ప‌టికే ప్రారంభించారు. కొన్నాళ్ల క్రితం రాజమౌళి ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను లాక్ చేసాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్ప‌టికే రాజమౌళి చెల్సియాపై స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని టాక్ వినిపించింది.

చెల్సియా అమెరికాలో జన్మించిన ఇండోనేషియా నటి. ఆమె 2014 నుండి 2017 వరకు ప్రసారమైన పాపులర్ సిట్‌కామ్ టెటాంగా మాసా గిటులో తన పాత్రతో పాపుల‌రైంది. 2015 నుండి 2018 వరకు వరుసగా నాలుగు ఇండోనేషియన్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. ఈ భామ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప పాపులారిటీ ఉంది. అందుకే రాజ‌మౌళి చెల్సియాను ఫైన‌ల్ చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అంతేకాదు.. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ముగ్గురు అంత‌ర్జాతీయ భామ‌లు క‌థానాయిక‌లుగా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని తాజాగా గుస‌గుస వినిపిస్తోంది. చెల్సియాతో పాటు మ‌రో ఇద్ద‌రిని ఎంపిక చేయాల్సి ఉందిట‌. ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఇది ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. రాజమౌళి యుఎస్‌లోని ఒక టాప్ కాస్టింగ్ ఏజెన్సీని నియమించుకుని అంత‌ర్జాతీయ స్టార్ల‌కు వ‌ల వేస్తున్నార‌ట‌. అయితే దీనిపై అధికారికంగా మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో రాజ‌మౌళి బ్రాండ్ అంత‌ర్జాతీయ విఫ‌ణికి ప‌రిచ‌య‌మైంది. అందువ‌ల్ల మ‌హేష్ సినిమాని కేవ‌లం పాన్ ఇండియాకే ప‌రిమితం చేయ‌కుండా, ఇత‌ర ప్ర‌పంచ దేశాల మార్కెట్ల‌లోను సేల్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. అందుకే కాస్టింగ్ ప‌రంగా, సాంకేతికంగా ఈ మూవీని మ‌రో లెవ‌ల్ లో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News