ముంబైలో 'యానిమల్‌' అర్థరాత్రి ఏం చేసిందో తెలుసా..?

రణబీర్‌ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Update: 2023-12-03 07:18 GMT

రణబీర్‌ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు రివ్యూవర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలతో సంబంధం లేకుండా యానిమల్ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

యానిమల్ సినిమా ఉత్తర భారతంలో రాబడుతున్న వసూళ్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి రెండు రోజుల్లో సాలిడ్‌ ఓపెనింగ్స్ ను యానిమల్‌ సాధించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ముంబై మల్టీ ప్లెక్స్‌ ల వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముంబైలోని ప్రధాన మల్టీప్లెక్స్ ల్లో మిడ్‌ నైట్‌ షో లు వేయడం... ప్రతి షో కూడా హౌస్‌ఫుల్‌ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం. సాధారణంగా మల్టీ ప్లెక్స్ ల్లో రాత్రి సమయంలో 10 లేదా 11 గంటల వరకు షో లు ముగుస్తాయి. కానీ యానిమల్‌ సినిమాకు అర్థరాత్రి 12.30, 1.00, 1.30, 2.00 గంటల షో లు కూడా పడ్డాయి. అంటే తెల్లవార్లు కూడా మల్టీప్లెక్స్ ల్లో షోలు వేస్తూనే ఉన్నారు.

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్‌ షో లు, మిడ్ నైట్ షో లు ఉంటాయి. కానీ ఈ రేంజ్ లో ముంబైలో అర్థరాత్రి షో లు, తెల్లవార్లు సినిమాను ప్రదర్శించడం ఇదే ప్రథమం అన్నట్లుగా జాతీయ మీడియాలో కూడా యానిమల్ షో ల గురించి చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో భారీగా షో లు వేస్తున్న కారణంగానే సినిమా కు మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి.

టాక్ తో సంబంధం లేకుండా, రివ్యూల తో సంబంధం లేకుండా యానిమల్ కి వసూళ్లు వస్తున్నాయి అంటూ కొందరు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నేడు ఆదివారం కూడా అదే రేంజ్ లో షో లు ఉండే అవకాశం ఉంది. మరి వీక్ డేస్ లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి.

Tags:    

Similar News