అతన్ని చిత్రహింసలకు గురి చేస్తుంటే కళ్లారా చూసిన నటి పవిత్ర

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన స్టార్ హీరో దర్శన్ అభిమాని హత్య కేసుకు సంబంధించిన రోజుకో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది.

Update: 2024-06-22 04:31 GMT

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన స్టార్ హీరో దర్శన్ అభిమాని హత్య కేసుకు సంబంధించిన రోజుకో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి.. తన అభిమాన హీరో దాంపత్య జీవితాన్ని సరి చేసేందుకు అత్యుత్సాహానికి పోవటం.. దానికి బదులుగా అతడి ప్రాణాల్ని అతడి అభిమాన హీరోనే తీయటం తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే పలు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

దర్శన్ అభిమాని తన ఫోటోల్ని దారుణంగా మార్చేసి.. తన ఫోన్ కు అదే పనిగా పంపుతున్న వైనంపై స్నేహితుడు దర్శన్ కు చెప్పానని.. ఆ తప్పు తప్పించి మరెలాంటి దారుణానికి పాల్పడలేదంటూ పోలీసుల విచారణలో చెప్పిన నటి పవిత్ర రియల్ లైఫ్ లోనూ మహానటిగా నటించారన్న నిజం తాజాగా వెలుగు చూసింది. దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టు అయిన ఆమెను విచారించినప్పుడు.. హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పటం తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసులో పవిత్రను ఏ1గా పోలీసులు పేర్కొంటూ ఆమె రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.

తాజాగా మాత్రం అందుకు భిన్నమైన అంశాలు వెలుగు చూశాయి. రేణుకా స్వామిని బంధించి కరెంటు షాక్ తో చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని నటి పవిత్ర తన కళ్లారా చూసిన వైనం వెలుగు చూసింది. చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్రా అక్కడే ఉన్నారని.. ఆమె వాటిని చూస్తూ ఉండిపోయారన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని పోలీసులు సేకరించారు. అంతేకాదు.. రేణుకాస్వామిని దర్శన్ హింసిస్తున్న వేళ.. నటి పవిత్ర కూడా తన చెప్పులతో అతడ్ని కొట్టిన వైనాన్ని పోలీసులు గుర్తించారు.

రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసిన స్టార్ హీరో దర్శన్ కిరాయి మూక.. అనంతరం అతడ్ని బెంగళూరుకు తీసుకెళ్లటం.. అక్కడి ఒక షెడ్డులో బంధించి.. చిత్రహింసలకు గురి చేయటం తెలిసిందే. తాను వెజిటేరియన్ ను అని చెప్పినా.. బలవంతంగా నాన్ వెజ్ బిర్యానీని నోట్లో పెట్టటంతో పాటు.. ఎముకలను తినిపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు..పలుమార్లు కరెంటు షాక్ ఇవ్వటం.. దారుణంగా కొట్టటం లాంటివి చేశారు. ఈ సమయంలో నటి పవిత్రా అక్కడే ఉండి.. అతన్ని హింసిస్తున్న వైనాన్ని కళ్లారా చూసినట్లుగా తేలింది.

రేణుకా స్వామి ఒంటి మీద పలు చోట్ల గాయాలు ఉండటంతో పాటు.. తీవ్ర రక్తస్రావంతోనే అతను మరణించినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు.. అతడి మర్మావయువాలు పూర్తిగా దెబ్బతినటంతో పాటు.. ఒక చెవి కూడా మిస్ అయిన విషయాన్ని శవపరీక్షలో పేర్కొన్నారు. తన అభిమానిని దారుణంగా హత్య చేసిన నటుడు దర్శన్.. అనంతరం బాడీని మిస్ చేసేందుకు రూ.30లక్షలమొత్తాన్ని కిరాయి మూకకు ఇచ్చారు. అంతేకాదు.. హత్య నేరాన్ని అంగీకరించేందుకు ఇద్దరికి చెరో రూ.5 లక్షలు చొప్పున చెల్లించారన్న మరో విషయం తాజాగా వెలుగు చూసింది. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News